హైదరాబాద్: ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పంట పండే రాష్ట్రాల్లో భారీ వరదలు, వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కొన్ని చోట్ల రూ.100 పైకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తక్కువ ధరకు ఉల్లిని సరఫరా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లలో రూ.25కి కిలో ఉల్లిని సరఫరా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉల్లి ధరల నుంచి ఊరట కల్పిస్తోంది.
ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిని ప్రజలకు అందించాలని నిర్ణయించింది. వ్యాపారుల నుంచి మార్కెటింగ్ శాఖ సేకరించి విక్రయిస్తుంది. ఇందులో భాగంగా వ్యాపారులతో చర్చలు జరిపారు. కిలో ఉల్లిని రూ.40కే ప్రభుత్వానికి ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. మలక్పేట మార్కెట్లోని వ్యాపారులు కూడా అంగీకరించారు.

హమాలీ, రవాణా ఛార్జీల్ని మార్కెటింగ్ శాఖ భరిస్తుంది. దీంతో బుధవారం నుంచి నగరంలోని మోహదీపట్నం, సరూర్ నగర్ రైతు బజార్లో కిలో ఉల్లి రూ.40కే లభిస్తోంది. దశలవారీగా అన్ని రైతు బజార్లలో ఉల్లిని విక్రయిస్తారు. ఒక వినియోగదారునికి ఒక కిలో ఉల్లి మాత్రమే ఇస్తారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications