ఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom)కు రూ.104 కోట్లు చెల్లించాలన్న టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (TDSAT) ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల సవాల్ చేసింది. అయితే కేంద్రం వ్యాజ్యాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది.
కేంద్రం వాదనకు బలమైన కారణాలు కనిపించడం లేదని జస్టిస్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. స్పెక్ట్రం ఛార్జీలపై పెట్టిన రూ.908 కోట్ల పూచీకత్తులో రూ.774 కోట్ల ఛార్జీల మొత్తం పోను మిగిలిన సొమ్మును చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని RCom టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన TDSAT మిగతా దాదాపు రూ.104.34 కోట్లు చెల్లించాలని డిసెంబర్ 2018లో ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర టెలికం విభాగం రూ.30.33 కోట్లు ఆర్కామ్కు చెల్లించింది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయగా చుక్కెదురైంది. ఈ పిటిషన్లో బలమైన కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications