ఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom)కు రూ.104 కోట్లు చెల్లించాలన్న టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (TDSAT) ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల సవాల్ చేసింది. అయితే కేంద్రం వ్యాజ్యాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది.
కేంద్రం వాదనకు బలమైన కారణాలు కనిపించడం లేదని జస్టిస్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. స్పెక్ట్రం ఛార్జీలపై పెట్టిన రూ.908 కోట్ల పూచీకత్తులో రూ.774 కోట్ల ఛార్జీల మొత్తం పోను మిగిలిన సొమ్మును చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని RCom టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన TDSAT మిగతా దాదాపు రూ.104.34 కోట్లు చెల్లించాలని డిసెంబర్ 2018లో ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర టెలికం విభాగం రూ.30.33 కోట్లు ఆర్కామ్కు చెల్లించింది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయగా చుక్కెదురైంది. ఈ పిటిషన్లో బలమైన కారణాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications