న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సెప్టెంబర్లో ముగిసిన ప్రథమార్థంలో రూ.7.66 లక్షల కోట్ల రుణాలు తీసుకుంది. ప్రథమార్థంలో రూ.6.98 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడున్నర లక్షల కోట్ల రుణాలు దాటాయి. మార్కెట్ నుండి రూ.12 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటామని మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది.

రుణ లక్ష్యం 50 శాతం పెంపు
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7.8 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే కరోనా కారణంగా దీనిని 50 శాతం పెంచి రూ.12 లక్షల కోట్లకు పెంచవలసిన పరిస్థితి వచ్చింది. బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్ట్ చివరి నాటికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్లో అందించిన రూ.7.96 లక్షల కోట్ల కంటే 9.3 శాతం ఎక్కువ. FY21లో ద్రవ్యలోటు రూ.14 లక్షల కోట్ల నుండి రూ.18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని నిపుణుల అంచనా. జూన్ నుండి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఆదాయంలో క్రమంగా మెరుగు కనిపిస్తోందని తరుణ్ బజాజ్ అన్నారు.

భారీ ప్యాకేజీ ఉండకపోవచ్చు
ఓ వైపు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరోవైపు రుణ లక్ష్యం రూ.12 లక్షల కోట్లకు కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. రుణాల్లో మార్పులేదని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మద్దతు కోసం మరో భారీ ప్యాకేజీ ఆశలు సన్నగిల్లాయని అంటున్నారు. అదనపు ఖర్చులతో కూడిన ఉద్దీపన ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే ఎంతోకొంత ప్యాకేజీ రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్రం రెండో అర్ధ సంవత్సరంలో రూ.4.34 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.2.1 లక్షల కోట్లను పెట్టుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఇది వెనుకబడింది.

ద్రవ్యలోటు పెరిగింది
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయాల్లో కొరత నేపథ్యంలో ఆగస్ట్లో వరుసగా రెండో నెల కూడా ద్రవ్యలోటు పెరిగింది. ఏప్రిల్-ఆగస్ట్ నెలలమధ్య కాలంలో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 109.3 శాతం ఉంది. గత ఏడాది మొత్తం మీద ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠస్థాయి 4.6 శాతంగా నమోదయింది. కరెంట్ ఖాతా మిగులు జూన్ క్వార్టర్లో జీడీపీలో 3.9 శాతానికి పెరిగి 1,980 కోట్ల డాలర్లకు (రూ.1.49 లక్షల కోట్లు) చేరుకుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications