ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు మూడు వారాల లాక్ డౌన్కు పిలుపునిచ్చారు. మరో ఎనిమిది రోజులు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుందా.. ఆగిపోతుందా అనే చర్చ సాగుతోంది. కానీ కేంద్రం కొన్ని సూచనలు, కఠిన నిర్ణయాలతో లాక్ డౌన్ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే విమానయాన రంగానికి కొంతలో కొంత ఊరట దక్కనుంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఏప్రిల్ 15వ తేదీ నుండి టిక్కెట్లు ఇస్తున్నాయి. దశలవారీగా విమాన సర్వీసులకు వెసులుబాటు కల్పించే అవకాశముంది.
21 రోజుల పాటు లాక్ డౌన్ ముగిసిన తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను ప్రభుత్వం దశలవారీగా అనుమతించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 14వ తేదీ తర్వాత ప్రయాణీకులకు టిక్కెట్లను బుక్ చేసుకునే స్వేచ్ఛ విమాయాన సంస్థలకు ఉందంటున్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ఆ మేర టిక్కెట్లు రద్దు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎయిరిండియా మినహా మిగతా విమానయాన సంస్థలు ఈ నెల 14న తర్వాత విమాన ప్రయాణాలకు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఎయిరిండియా మాత్రం ఈ నెల 30వ తేదీ తర్వాత తేదీలకే టిక్కెట్లు ఇస్తోంది.

తొలుత అంతర్జాతీయ విమానాలు, ఆ తర్వాత దేశీయ విమానాలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బపడింది విమానయాన రంగం, పర్యాటక రంగాల పైనే. వంద శాతం మూలనపడి, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. దీంతో వివిధ విమానయాన సంస్థలు ఉద్యోగుల వేతనాలు కట్ చేస్తున్నాయి.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications