ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ప్రారంభించి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పీఎం కిసాన్ మొబైల్ యాప్ను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకు దీనిని తీసుకు వచ్చారు. దీని ద్వారా ఖాతాలో నగదు జమ వివరాలు, పేరు, చిరునామా మార్పులతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు పొందవచ్చు.
పీఎం కిసాన్ స్కీం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.6,000 మోడీ ప్రభుత్వం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది. పీఎం కిసాన్ స్కీంను ఫిబ్రవరి 24, 2019న ఉత్తర ప్రదేశ్లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ స్కీంలో చేరలేదు.

ఈ స్కీం కింద 9.74 కోట్ల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. కేంద్రం 14 కోట్ల రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన వివరాల ప్రకారం 8.45 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో భాగంగా పీఎం కిసాన్ స్కీంను తీసుకు వచ్చిందని కేంద్రమంత్రి తోమర్ అన్నారు.
ఈ పథకానికి 2019-20 బడ్జెట్లో రూ.75,000 కోట్లు కేటాయించారు. రైతులకు ఇచ్చింది రూ.42,044 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు రూ.54 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రూ.20వేల కోట్లు మిగలవచ్చు. సంతృప్తకరస్థాయిలో ఈ పథకం కింద ప్రయోజనం అందుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 22, తెలంగాణ 23వ స్థానంలో ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications