పాన్-ఆధార్ లింక్ చేసుకోలేదా, ప్రభుత్వం భారీ ఊరట: గడువు జూన్ 30 వరకు పొడిగింపు

ఈ రోజు కూడా మీరు పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోలేదా? అయితే మీకో ఊరట! పాన్-ఆధార్ లింక్ తేదీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30వ తేదీ వరకు పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించారు. పాన్-ఆధార్ లింకింగ్ గడువును పలుమార్లు పొడిగించింది కేంద్రం. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే వారికి ఇది భారీ ఊరట. ఎందుకంటే లింక్ చేయకుంటే ఆ తర్వాత పాన్ కార్డు చెల్లిబాటు కాకపోవడం, జరిమానా వంటివి ఉంటాయి.

ఇప్పుడు మరోసారి గడువును పొడిగించిన నేపథ్యంలో ఇప్పటికైనా త్వరగా లింక్ చేసుకోవాలి. గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. పాన్-ఆధార్ కార్డును ఈ ఆర్ధరాత్రి లోపు లింక్ చేయకుంటే రూ.1000 వరకు పెనాల్టీ పడుతుంది. అంతేకాదు పాన్ కార్డు ఇన్-ఆపరేటివ్ అవుతుంది.

Government Extends Last Date To Link Aadhaar With PAN Card to June 30

పాన్ ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఆదాయపు పన్ను చట్టం 1961, కొత్త సెక్షన్ 234H కింద జరిమానా విధిస్తారు. మార్చి 23న లోకసభలో ఫైనాన్స్ బిల్ పాస్ చేసే సమయంలో ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది.
సెక్షన్ 234H ప్రకారం ఇండివిడ్యువల్స్ పాన్-ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+