ఆర్థిక శాఖ పరిధిలోకి DPE, ఆర్థికంగా బలపడేందుకు వెసులుబాటు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి, త్వరితగతిన ప్రయివేటీకరణ చేయడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థల విభాగం(డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్-DPE)ని కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. కేంద్రం ఈ నిర్ణయంతో ఆర్థికశాఖ కింద ప్రస్తుతం 6 విభాగాలు ఉంటాయి.

DPE ఆర్థిక శాఖ కిందకు వస్తే మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలు కలుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా DPEని చేర్చారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

 Government brings DPE under finance ministry

నిన్న కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ విస్తరణకు ముందు ఈ నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలు ఉన్నాయి. గతంలో వాజపేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా, దానిని కూడా ఆర్థికశాఖలో విలీనం చేసింది. విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని ఆర్థిక శాఖ కిందకు తీసుకు వచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+