గూగుల్ భారత్ మీద గురి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతున్న నేపథ్యంలో భారతదేశం కేంద్రంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందుకోసం భారత సముద్ర తీర ప్రాంతాన్ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు.భారత సముద్ర గర్భం నుంచి కేబుల్స్ ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యేలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ ఇంటర్నెట్ & AI కోసం భారీ అడుగు వేసే క్రమంలో భాగంగా గూగుల్ ప్రకటించిన అమెరికా-భారత్ కనెక్ట్ అనే అంశం తాజాగా తెరమీదకు వచ్చింది.
ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ భారతదేశంలో ఒక ప్రధాన మౌలిక సదుపాయాల పుష్ ను ప్రకటించింది, ఇది భారతదేశాన్ని అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ ప్రాంతాలతో నేరుగా కలుపుతుంది. న్యూఢిల్లీ లోని AI శిఖరాగ్ర సమావేశంలో CEO సుందర్ పిచాయ్ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. ఈ ప్లాన్ భారతదేశంలో గత ఐదు సంవత్సరాల్లో ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల AI మౌలిక సదుపాయాల పెట్టుబడికి అనుగుణంగా ఉంటుంది.

అమెరికా-ఇండియా కనెక్ట్ లో మూడు ప్రధాన సబ్సీ కేబుల్ మార్గాలు ఉన్నాయి, ఇవి భారతదేశాన్ని సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకి కలుపుతాయి. అలాగే, US, భారతదేశం, దక్షిణ అర్ధగోళాన్ని కలుపుతూ నాలుగు ఫైబర్-ఆప్టిక్ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. విశాఖపట్నం నుండి దక్షిణాఫ్రికా, సింగపూర్లకు నేరుగా ఫైబర్ కనెక్షన్లు నిర్మించడం ద్వారా తూర్పు తీర నగరాన్ని అంతర్జాతీయ సబ్సీ గేట్వేగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో ప్రధాన కేబుల్ ల్యాండింగ్లు ముంబై, చెన్నైచుట్టూ ఉండగా, వైజాగ్ చేరికతో భౌగోళిక వైవిధ్యాన్ని, నెట్వర్క్ భద్రతను పెంచుతుంది.
పశ్చిమ తీరంలో ముంబై నుండి పశ్చిమ ఆస్ట్రేలియా వరకు కొత్త కేబుల్.. ఇప్పటికే ఉన్న పసిఫిక్ మార్గాలను పూర్తి చేస్తుంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం మరింత సామర్థ్యం గల సబ్సీ కేబుల్స్ AI యాక్సెస్ ను వేగవంతం చేస్తాయి. ఎక్కువ సముద్ర జలాల సామర్థ్యం అంటే సాధారణంగా చౌకైన, వేగవంతమైన ఇంటర్నెట్, ఇది ఉత్పాదకత, వ్యాపారం, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
కేబుల్ పెట్టుబడులతో పాటుగా.. Google.org AI ద్వారా ప్రజా సేవలను మెరుగుపరచడానికి 30 మిలియన్ డాలర్లు, శాస్త్రీయ పరిశోధన కోసం మరో 30 మిలియన్ డాలర్లు పెట్టుబడులను పెట్టనుంది. స్థానికంగా సైన్స్ మోడళ్ల కోసం Google DeepMind భారత ప్రభుత్వంతో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తోంది.
భారతదేశం.. గూగుల్ కోసం కేవలం వృద్ధి మార్కెట్ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్, వేగంగా విస్తరిస్తున్న స్థానిక భాగస్వామ్యాల కేంద్రంగా మారింది. గూగుల్ ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 185 బిలియన్ డాలర్లు ఇందుకోసం పెట్టుబడి పెడుతోంది. ఇందులో భారతదేశం కీలక భాగంగా ఉంది. ఈ ప్రయత్నం ద్వారా మన దేశం AI, క్లౌడ్, డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో గ్లోబల్ టెక్ మాడల్ గా ఎదగి అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
ఏదేమైనా ఈ అమెరికా-భారత కనెక్ట్ ప్రాజెక్ట్ దేశాన్ని అంతర్జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాల హబ్గా మార్చి, AI, క్లౌడ్, డేటా సెంటర్ రంగాల్లో కొత్త అవకాశాలను తెస్తుందని భావిస్తున్నారు. విశ్వసనీయ, వేగవంతమైన ఫైబర్ కనెక్షన్లు, సబ్సీ కేబుల్ లింకులు, DeepMind & Google.org సహకారం ద్వారా భారతదేశం గ్లోబల్ AI, ఇన్నోవేషన్ కేంద్రంగా దశలవారీగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
More From GoodReturns

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications