IT Layoffs: ప్రపంచంలో రెండు అతిపెద్ద టెక్ కంపెనీల ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే వేలమంది ఉద్యోగులను తొలగించిన కంపెనీలు 2023లోనూ ఈ తొలగింపులను కొనసాగిస్తాయని తెలుస్తోంది. మాంద్యం భయాల మధ్య టెక్ కంపెనీలకు ఆదాయాలు మెరుగుపడని కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొంత కాలం ఈ తొలగింపులు ఉండనున్నాయి. ఈ టెక్ తొలగింపులు భారత ఉద్యోగులు కూడా బలవుతున్నారు.

టెక్ దిగ్గజాలు..
రానున్న కాలంలో అమెజాన్, గూగుల్ కంపెనీలు అతిపెద్ద తొలగింలను ప్రకటించబోతున్నట్లు సమాచారం. అమెజాన్ ఇప్పటికే 10,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇండియాతో సహా అనేక దేశాల్లోని ఉద్యోగులను కంపెనీ తొలగిస్తోంది. తొలగింపులు రానున్న కొద్ది నెలలపాటు తొలగింపులు కొనసాగుతాయి.
ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ తొలగింపులు ఉంటాయని, త్వరలోనే ఆ సంఖ్యను ప్రకటిస్తామని అమెజాన్ సీఈవో తెలపటం గమనార్హం. తొలగించనున్న ఉద్యోగుల సంఖ్య గతంలో అంచనావేసిన దానికంటే పెరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని మార్కెట్లలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలు అనివార్యంగా మారాయని వెల్లడించారు.

Google..
గ్లోబల్ టెక్ సర్వీస్ సంస్థ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ గతంలో చెప్పినట్లుగా తమ ఆదాయం పెరగకపోతే లేఆఫ్ కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే 10,000 మందిని తొలగించిన గూగుల్.. తొలగింపులను 2023లోనూ కొనసాగిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుత ఏడాదిలో..
2022ను గమనిస్తే చాలా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. వీటిలో అనేక టెక్ కంపెనీలు మాత్రం మెుదటి 10 స్థానాల్లో ఉన్నాయి.
* మెటా - 11000 మంది ఉద్యోగులను తొలగించింది
* అమెజాన్ - 10000 మంది ఉద్యోగులను తొలగించింది
* ట్విట్టర్ - 3700 మంది ఉద్యోగులను తొలగించింది
* బోర్డు - 3580 మంది ఉద్యోగులను తొలగించింది
* Better.com - 3250 మంది ఉద్యోగులను తొలగించింది
* మైక్రోసాఫ్ట్ - 3000 మంది ఉద్యోగులను తొలగించింది
* బైజూస్ - 2500 మంది ఉద్యోగులను తొలగించింది
* బ్లింకిట్ - 1600 మంది ఉద్యోగులను తొలగించింది
* యూనిలీవర్ - 1500 మంది ఉద్యోగులను తొలగించింది
* దోర్దేష్ - 1250 మంది ఉద్యోగులను తొలగించింది
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications