ముంబై: బంగారం ధరలు 2020లో ఇప్పటి వరకు 28 శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా పసిడి ధరలు వేగంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా, లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో 1400 స్థాయిలో ఉన్న ఔన్స్ పసిడి 2072 డాలర్లను తాకింది. అయితే ఇప్పుడు 1900 డాలర్లకు సమీపంలో ఉంది. దేశీయ మార్కెట్లో రూ.40వేల లోపు ఉన్న పసిడి, రూ.56వేలను కూడా దాటింది. ఇప్పుడు రూ.50వేల స్థాయిలో కదలాడుతోంది. 2020లో ఇప్పటి వరకు బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 23 శాతం, ఇండియాలో 28 శాతం పెరిగింది. 2019లో కూడా బంగారం డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి అదే బాటలో నడిచింది.

10 శాతం తగ్గింది...
ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో పసిడి ధరలు సాధారణ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే కరోనా వల్ల వివిధ దేశాలు లాక్ డౌన్ విధించడంతో, ఆంక్షలు విధించడంతో క్రమంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. అలా చూస్తే బంగారం దాదాపు 40 శాతం పెరిగింది. అయితే వ్యాక్సీన్ ప్రకటనల నేపథ్యంలో ఆగస్ట్ నుండి 10 శాతం మేర ధరలు క్షీణించాయి. దీంతో పెరుగుదల 28 శాతం వరకు ఉంది.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. వెండి కూడా అదే బాటలో నడిచింది. కొత్త వైరస్ ఆందోళన నేపథ్యంలో నిన్న రూ.50,000కు పైకి చేరుకొని, రూ.51,000 దిశగా వెళ్లింది. అయితే ఆ తర్వాత తగ్గింది అయితే నిన్న స్వల్ప పెరుగుదలతో ముగిసింది. నేడు (డిసెంబర్ 22, మంగళవారం) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.442.00 (-0.88%) క్షీణించి రూ.49974.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,527.00 ప్రారంభమై, రూ.50,540.00 గరిష్టాన్ని, రూ.49,960.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.437.00 (-0.87%) తగ్గి రూ.50020.00 వద్ద కట్రేడ్ అయింది. రూ.50,500.00 ప్రారంభమై, రూ.50,555.00 గరిష్టాన్ని, రూ.50,020.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కిలో రూ.1,947.00 (-2.82%) తగ్గి రూ.67071.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,797.00 ప్రారంభమై, రూ.69,797.00 గరిష్టాన్ని, రూ.66,849.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్ రూ.1,975.00 (-2.82%) తగ్గి రూ.67999.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,494.00 ప్రారంభమై, రూ.70,574.00 గరిష్టాన్ని, రూ.67,773.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగానే తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 15.20 (-0.81%) డాలర్లు క్షీణించి 1,867.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,865.10 - 1,889.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.762 (-2.89%) క్షీణించి 25.617 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.508 - 26.812 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..



Click it and Unblock the Notifications