బంగారం, వెండి ధరలు నేడు (గురువారం, జూన్ 11) పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ గోల్డ్ కాంట్రాక్ట్ ఉదయం గం.9.20 సమయానికి 10 గ్రాములకు 1.1 శాతం పెరిగి రూ.47,173 పలికింది. జూలై ఫ్యూచర్స్ సిల్వర్ 1.9 శాతం పెరిగి కిలో రూ.49,018 పలికింది. బంగారం రూ.47,000-రూ.47,200 మధ్య పలికితే ఆ తర్వాత రూ.47,500 నుండి రూ.48,000కు చేరుకునే అవకాశాలు తలుపులు తెరిచి ఉన్నట్లుగానే భావించాలని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం రూ.500, వెండి రూ.1000 పెరుగుదల
ఎంసీఎక్స్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు ఏకంగా రూ.550 పెరిగి రూ.47,160కి అటు ఇటుగా ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.950కి పైగా పెరిగి రూ.49,018 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్స్ 1,732.56 డాలర్లు పలికింది. అంతకుముందు జూన్ 2వ తేదీన రికార్డ్ ధర పలికింది. వెండి 1.7 శాతం తగ్గి 17.95 డాలర్లు పలికింది. ప్లాటినమ్ ధర మాత్రం 0.5 శాతం పెరిగి 836.38 డాలర్లు పలికింది.

బంగారం ధరలు తిరిగి ఎందుకు పెరుగుతున్నాయి
ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివిధ ఆర్థిక సంస్థలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండోసారి పుంజుకుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని చెబుతున్నాయి. కరోనా రెండోసారి విజృంభించకుంటే మాత్రం వచ్చే ఏడాదికి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటాయని వెల్లడించాయి. మరోవైపు కరోనా రెండోసారి పుంజుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి వరకు బంగారం ధరలు తగ్గి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలపై ఆందోళన పరిస్థితులు కనిపించడంతో తిరిగి పెరుగుతున్నాయి.

ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్
2022 వరకు వడ్డీ రేటును సున్నాకు దగ్గరగానే ఉంచాలని ఫెడ్ రిజర్వ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోను పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు. కరోనా నుండి కోలుకొని లేబర్ మార్కెట్ పుంజుకునే వరకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనలు కొనసాగుతాయని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. భారీ ఉద్దీపన చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు బంగారానికి డిమాండ్ పెంచుతాయి.

హైదరాబాదులో బంగారం ధరలు
హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఈ రోజు రూ.500 వరకు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.48,980కి ఎగబాకింది. 22 క్యారెట్ల బంగారం 44,940కి చేరుకుంది. ఢిల్లీలో రూ.500 పెరిగి రూ.46,910కి చేరుకున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications