వివిధ నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం, వెండి ధరలు ఆదివారం ముఖ్య నగరాల్లో స్వల్పంగా పెరిగాయి. క్రితం సెషన్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల పసిడి రూ.45,710 వద్ద ముగిసింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు వేర్వేరుగా ఉంటాయి. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.41,900, 24 క్యారెట్ల బంగారం రూ.45,710 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్లో పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.41,900, 24 క్యారెట్ల పసిడి రూ.45,710గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.200, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగింది.
వాహనదారులకు కేంద్రం శుభవార్త, ఆ డాక్యుమెంట్స్ పర్మిట్ గడువు జూన్ 30 వరకు పొడిగింపు
ధరలు ఇలా..
కేరళ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.41,900, 24 క్యారెట్ల పసిడి రూ.45,710గా ఉంది. వెండి ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. వెండి కిలో బెంగళూరులో రూ.65,700, హైదరాబాద్లో రూ.69,300, కేరళలో రూ.64,900, విశాఖపట్నంలో రూ.69,300గా ఉంది.
ఎంసీఎక్స్లో...
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో పసిడి ధరలు క్రితం సెషన్లో స్వల్పంగా క్షీణించాయి. ఏప్రిల్ ఫ్యూచర్స్ 45.00 (0.10 శాతం) తగ్గి రూ.44,650 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.50.00 (-0.11%) క్షీణించి రూ.45062.00 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్లో కిలో వెండి మే ఫ్యూచర్స్ రూ.185.00 (0.29%) తగ్గి రూ.64684.00 వద్ద, జూలై ఫ్యూచర్స్ రూ.235.00 (0.36%) తగ్గి రూ.65651.00 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో చివరి సెషన్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. చివరి సెషన్లో 6.20 (+0.36%) పెరిగి 1731.30 డాలర్ల వద్ద ముగిసింది. ఆ సెషన్లో 1,719.40 - 1,735.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.063 (+0.25%) డాలర్లు పెరిగి 25.110 డాలర్ల వద్ద కదలాడింది. ఆ సెషన్లో 24.920 - 25.325 డాలర్ల మధ్య కదలాడింది.