ముంబై: బంగారం ధరలు మంగళవారం(డిసెంబర్ 22) ప్రారంభ సెషన్లో ఒత్తిడికి గురయ్యాయి. బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో కొత్త రకం వైరస్ కేసులు నమోదు కావడం, పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయడంతో గత కొద్ది రోజులుగా పసిడిపై ఒత్తిడి పెరిగి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా వ్యాక్సినైజేషన్ ప్రకటన నేపథ్యంలో గత నెలలో రూ.47,500 స్థాయికి వచ్చిన పసిడి, ఇప్పటి వరకు దాదాపు రూ.3000 పెరిగింది. నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బ్రిటన్లో కొత్త కేసుల నేపథ్యంలో నిన్న మార్కెట్లు కుప్పకూలాయి. అయితే చివరలో అతి భారీ నష్టాల నుండి కాస్త ముందుకు వచ్చాయి. అలాగే, బంగారం ధరలు కూడా ప్రారంభంలో రూ.500 వరకు పెరిగినా, చివరకు స్వల్ప పెరుగుదలతో ముగిశాయి.

నిన్న బంగారం, వెండి ముగింపు
బంగారం ధర నిన్న ఉదయం భారీగా పెరిగినప్పటికీ, ముగింపు సమయానికి స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న రూ.85.00 (0.17%) పెరిగి రూ.50389.00 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.10%) క్షీణించి రూ.50400.00 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5,700 తక్కువగా ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.1,040.00 (1.53%) పెరిగి రూ.68947.00 వద్ద క్లోజ్ అయింది. మే ఫ్యూచర్స్ రూ.1,329.00 (1.94%) పెరిగి రూ.69985.00 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.70వేలు దాటిన సిల్వర్ ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ గతవారం రూ.60వేలకు దిగువన ఉన్న పసిడి, ఇప్పుడు రూ.69వేలకు చేరుకుంది.

నేటి బంగారం ధరలు
బంగారం ధర ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఉదయం గం.9.45 సమయానికి రూ.44.00 (0.09%) పెరిగి రూ.50460.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.50,527.00 వద్ద ప్రారంభమై, రూ.50,527.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,416.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ 40.00 (0.08%) పెరిగి రూ.50497.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,500.00 వద్ద ప్రారంభమై, రూ.50,507.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,465.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.588.00 (0.85%) పెరిగి రూ.69606.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,797.00 వద్ద ప్రారంభమై, రూ.69,797.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,491.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.577.00 (0.82%) పెరిగి రూ.70551.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,494.00 వద్ద ప్రారంభమై, రూ.70,574.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,437.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న 1,882.80 వద్ద క్లోజ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.95 (+0.21%) డాలర్లు పెరిగి 1,886.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,880.55 - 1,889.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 26.28 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.258 (+0.98%) డాలర్లు పెరిగి 26.637 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.312 - 26.812 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 54.16 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!



Click it and Unblock the Notifications