రూ.400 పెరిగిన బంగారం, రూ.1,000 పెరిగిన వెండి ధరలు
ముంబై: బంగారం ధరలు శుక్రవారం (నవంబర్ 13) భారీగా పెరిగాయి. పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51వేలను దాటింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం పసిడి రూ.52వేలను దాటింది. ఈరోజు మళ్లీ క్రాస్ చేసింది. జోబిడెన్ గెలుపు, కరోనా వ్యాక్సీన్ ప్రకటన సమయంలో పసిడి ఏకంగా రూ.2500 తగ్గి రూ.50వేల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ఇప్పటికీ రూ.5,200 క్కువగా ఉంది.
రూ.400 పెరిగిన బంగారం ధర
ఎంసీఎక్స్లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.406.00 (0.80%) క్షీణించి రూ.51,006.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,665.00 వద్ద ప్రారంభమై, రూ.51,139.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,609.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.383.00 (0.76%) పెరిగి రూ.51,056.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,747.00 వద్ద ప్రారంభమై, రూ.51,230.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
రూ.1000 పెరిగిన వెండి
బంగారం ధర రూ.400 పెరగగా, సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.వెయ్యి పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో రూ.983.00 (1.57%) పెరిగి రూ.63722.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,539.00 వద్ద ప్రారంభమై, రూ.64,152.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,510.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.1,033.00 (1.60%) పెరిగి రూ.65490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,431.00 వద్ద ప్రారంభమై, రూ.65,845.00 గరిష్టాన్ని, రూ.64,350.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం మేర పెరిగి 1891 డాలర్లు పలికింది. 1,872.30 - 1,895.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 25.78% పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1.88 శాతం పెరిగి 24.762 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.227 - 24.898 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 41.74%
శాతం పెరిగింది.