భారీగా తగ్గి, మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు: వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
గత కొద్ది రోజులుగా రూ.45వేలకు దిగువనే ఉన్న పసిడి ధరలు, నిన్న రూ.44వేల దిగువకు కూడా వచ్చాయి. నేడు మాత్రం స్వల్పంగా పెరిగి తిరిగి రూ.44,000 మార్కును క్రాస్ చేశాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.12000 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1700 డాలర్ల దిగువకు వచ్చిన పసిడి నేడు తిరిగి ఆ మార్కును దాటింది. వెండి ధరలు కూడా దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. కరోనా కేసులు పెరగడం, బిట్ కాయిన్ పైన అనుమానాలు వంటి వివిధ అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడ్డాయి.
రూ.400 పెరిగిన బంగారం
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 31, 2021) సాయంత్రం సెషన్లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.327.00 (0.75%) పెరిగి రూ.44,200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,870.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.43,711.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. రూ.345.00 (0.78%) పెరిగి రూ.44768.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,305.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,774.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,215.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి రూ.300 పైకి
వెండి ధరలు నేడు సాయంత్రం సెషన్లో రూ.300 వరకు పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.307.00 (0.49%) పెరిగి రూ.63431.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.63,578.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.288.00 (-0.45%) తగ్గి రూ.64300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
1700 డాలర్ల పైకి బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గగా, నేడు తిరిగి పుంజుకున్నాయి. ఏకంగా 25 డాలర్ల వరకు పెరిగాయి. కామెక్స్లో +24.70 (+1.47%) డాలర్లు తగ్గి 1,710.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,677.50 - 1,708.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల స్థాయిలోనే ఉంది. ఔన్స్ ధర 0.261
(+1.08%) డాలర్లు తగ్గి 24.398 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.793 - 24.418 డాలర్ల మధ్య కదలాడింది.