For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరుగుతోంది..: రూ.51,000 మార్క్ దాటిన బంగారం ధర, వెండిదీ అదే దారి

|

క్రితం సెషన్‌లో పెరిగిన పసిడి ధరలు నేడు (అక్టోబర్ 21, బుధవారం) ప్రారంభ సెషన్‌లోను అదే మార్గంలో నడిచాయి. ఉదయం గం.9.40 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.111(0.22 శాతం) తగ్గి రూ.51,021 వద్ద ట్రేడ్ అయింది. బంగారం మళ్లీ రూ.51వేల మార్క్ దాటింది. రూ.50,950 వద్ద ప్రారంభమైన ట్రేడింగ్, రూ.51,077 వద్ద గరిష్టం, రూ.50,950 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,000కు పైగా తక్కువ పలుకుతోంది. పండుగ సీజన్ సమీపిస్తున్న సమయంలో పసిడి ధరలు తిరిగి పెరగడం గమనార్హం. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా రూ.103(0.20 శాతం) పెరిగి రూ.51,035 వద్ద ట్రేడ్ అయింది.

దిగుమతుల దెబ్బ, అమెరికా సహా విదేశాల నుండి రాని కంటైనర్లు, ధరలు రెండింతలుదిగుమతుల దెబ్బ, అమెరికా సహా విదేశాల నుండి రాని కంటైనర్లు, ధరలు రెండింతలు

బంగారం దారిలోనే వెండి పెరుగుదల

బంగారం దారిలోనే వెండి పెరుగుదల

వెండి ఫ్యూచర్స్ కిలో రూ.348(0.55 శాతం) పెరిగి రూ.63,470వద్ద ట్రేడ్ అయింది. రూ.63,530 వద్ద ప్రారంభమై, రూ.63,591 వద్ద గరిష్టాన్ని, రూ.63,422వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.371 (0.57 శాతం) పెరిగి రూ.65,090 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,085 వద్ద ప్రారంభమైన ధర, రూ.65090 వద్ద గరిష్టాన్ని, రూ.65,085 కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ నెలలో రూ.79వేలకు చేరుకుంది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.16వేల వరకు తక్కువగా ఉంది.

మళ్లీ పెరుగుదుల దిశగా...

మళ్లీ పెరుగుదుల దిశగా...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగి ఔన్స్ 1,922.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,909.40 - 1,924.45 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1915.40 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో 6 డాలర్లకు పైగా పెరిగింది.

వెండి ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.93 శాతం లాభపడి 25.212 డాలర్లు పలికింది. 24.745 - 25.255 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.980 డాలర్ల వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ఆగస్ట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 150 డాలర్లు తక్కువగా ఉంది. వెండి ఫ్యూచర్స్ 29 డాలర్లు దాటింది. ఆ ధరతో 5 డాలర్ల వరకు తక్కువ ఉంది.

ఆర్థిక ప్యాకేజీ ఆమోదానికి..

ఆర్థిక ప్యాకేజీ ఆమోదానికి..

అమెరికా చట్టసభ సభ్యులు నవంబర్ 3వ తేదీ లోపు ఆర్థిక ప్యాకేజీకి అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.14 శాతం క్షీణించింది. బంగారం ధరలపై ఈ ప్రభావం కూడా ఉంటుంది.

ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.50,950 పలికింది.22 క్యారెట్ల పసిడి రూ.46,700 పలికింది. వెండి కిలో రూ.62వేల వరకు పలికింది.

English summary

మళ్లీ పెరుగుతోంది..: రూ.51,000 మార్క్ దాటిన బంగారం ధర, వెండిదీ అదే దారి | Gold prices today rise above 51,000 but still down ₹5000 from record highs

Gold prices edged higher in Indian markets, extending gains to the third day on signs that US lawmakers could agree on a new stimulus package before the November 3 election. December gold futures on MCX rose 0.27% to ₹51,047 per 10 gram while silver futures gained 0.6% to ₹63,505 per kg.
Story first published: Wednesday, October 21, 2020, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X