తగ్గిన బంగారం, వెండి ధరలు: ప్యాకేజీపై స్పష్టత కోసం వెయిటింగ్!

ముంబై: బంగారం, వెండి ధరలు మంగళవారం (అక్టోబర్ 20) క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఈ ప్రభావం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లపై కనిపించింది. ప్రారంభ సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ రూ.98 (0.19 శాతం) క్షీణించి రూ.50,589 పలికింది. రూ.50,600 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా, రూ.50,626 వద్ద గరిష్టాన్ని, రూ.50,525 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధర రూ.5,500 తక్కువ పలుకుతోంది.

బంగారం ధరలో క్షీణత.. అదే దారిలో వెండి

బంగారం ధరలో క్షీణత.. అదే దారిలో వెండి

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.124 (0.24 శాతం) క్షీణించి రూ.50,626 పలికింది. రూ.50,638 వద్ద ప్రారంభం కాగా, రూ.50,643 వద్ద గరిష్టాన్ని, రూ.50,620 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. ప్రారంభ సెషన్‌లో కిలో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.55 (0.09 శాతం) క్షీణించి రూ.62,040 పలికింది. రూ.62,050 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,150 వద్ద గరిష్టాన్ని, రూ.61,792 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.98 (0.15శాతం) క్షీణించి కిలో రూ.63,600 పలికింది. రూ.63,500 వద్ద ప్రారంభమైన ధర రూ.63,600 వద్ద గరిష్టం వద్ద కొనసాగుతోంది. ప్రారంభ ధరనే కనిష్టం.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.41 శాతం పడిపోయి ఔన్స్ ధర 1,903.90 డాలర్లు పలికింది. 1,896.95 - 1,907.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో1911.70 డాలర్ల వద్ద ముగిసింది.

స్పాట్ గోల్డ్ 1903 డాలర్లు పలికింది.

ఇక వెండి ఫ్యూచర్స్ 0.56 శాతం క్షీణించి ఔన్స్ 24.560 డాలర్లు పలికింది. 24.410 - 24.657 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.698 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ప్లాటినమ్, పల్లాడియం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

ఆర్థిక ప్యాకేజీపై మరింత స్పష్టత కోసం..

ఆర్థిక ప్యాకేజీపై మరింత స్పష్టత కోసం..

అమెరికా ఆర్థిక ప్యాకేజీపై మరింత స్పష్టత కోసం బంగారం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. దీంతో దాదాపు నిలకడగా ఉంది. 1900 డాలర్లకు అటు ఇటుగా తచ్చాడుతోంది. పరిస్థితులు ఇలాగే సాధారణంగా కొనసాగితే ఈ వారం పసిడి ధరలు 1930 డాలర్ల నుండి 1880 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బులియన్ మార్కెట్లో..

బులియన్ మార్కెట్లో..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి రూ.51,730 పలికింది. జీఎస్టీ ఉంటుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 53,780, 22 క్యారెట్లు రూ.49,300 పలికింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+