Gold prices today: భారీగా తగ్గి, నేడు పెరిగిన బంగారం ధరలు, వెండి డౌన్
ముంబై: బంగారం ధరలు సోమవారం (నవంబర్ 23) స్వల్పంగా పెరిగాయి. గత రెండు వారాల్లో దాదాపు రూ.2వేలు క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో రూ.75 పెరిగింది. ఉదయం గం.10.45 సమయానికి 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి రూ.50,287 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,234.00 ప్రారంభమైన ధర, రూ.50,287.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,211.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ఫ్యూచర్స్ రూ.56,200 పలికింది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6000 వరకు తక్కువగా ఉంది.
మారుతున్న బ్యాంకు రూల్స్, డిసెంబర్ 2020 నుండి RTGS
వరుసగా తగ్గి.. నేడు స్వల్ప పెరుగుదల
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.75 క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.65.00 (0.13%) తగ్గి రూ.50,291 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,231.00 ప్రారంభమైన ధర, రూ.50,305.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,231.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతకుముందు వారం రూ.1200 తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్, గతవారం రూ.700 క్షీణించింది. మొత్తంగా దాదాపు రూ.2వేలు తగ్గింది. ఈ వారం స్వల్పంగా పెరుగుదలతో ప్రారంభమయ్యాయి.
బంగారం పైకి.. వెండి కిందకు
వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.-38.00 (-0.06%) క్షీణించి రూ.62,120 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,119.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,190.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,055.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేల ధరతో వెండి రూ.18వేల వరకు తక్కువ పలుకుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో రెండూ డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రెండింటి ధరలు క్షీణించాయి. ఔన్స్ పసిడి +0.15 (+0.01%) డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,867.45 - 1,875.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,872.40 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 25 డాలర్లకు పైగా పెరిగింది.
ఇక, వెండి ఫ్యూచర్స్ -0.040 (-0.16%) డాలర్లు తగ్గి 24.323 వద్ద ట్రేడ్ అయింది. నేడు 24.148 - 24.455 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.363 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 41 శాతం పెరిగింది.