రూ.48,000 పైనే బంగారం ధరలు, వెండి రూ.67,500 దిగువకు...
నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. మంగళవారం ప్రారంభ సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.146.00 (0.30%) పెరిగి రూ.48240.00 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.48,300 సమీపానికి చేరుకుంది. గతవారం పసిడి రూ.58,500 దరికి చేరుకుంది. అయితే గత వారం చివరి సెషన్లో భారీగా తగ్గడంతో క్రితం వారం గరిష్టం కంటే రూ.250 వరకు తక్కువగా ఉంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.183.00 (0.38%) పెరిగి రూ.48543.00 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.184.00 (0.27%) పెరిగి రూ.67430.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.222.00 (0.32%) ఎగిసి రూ.68761.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 8.15 డాలర్లు పెరిగి 1817.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.98 డాలర్లు పెరిగి 25.242 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. రూ.48,000 దిగువన కదలాడిన పసిడి, ఇప్పుడు రూ.48,000 దాటింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్ రూ.70,000 స్థాయి నుండి రూ.67,500 దిగువకు వచ్చింది. కరోనా కేసులు, డెల్టా వేరియంట్ ఆందోళనలు పసిడిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.