కరోనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. ఈ రోజు ఉదయం ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.72 శాతం లేదా రూ.342 తగ్గి రూ.47,072 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 1.55 శాతం లేదా రూ.752 తగ్గి రూ.47,887 పలికింది. బహిరంగ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధర రూ.477 పెరిగింది. వెండి ధర రూ.26 పెరిగి కిలో రూ.49,868కి చేరుకుంది.

పెరుగుతూ.. తగ్గుతూ
ఎంసీఎక్స్లో బంగారం ధరలు గత సెషన్లో రూ.800 పెరిగింది. ఈ రోజు ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయింది. కరోనా మహమ్మారి కేసులు, అమెరికా, బ్రిటన్ సహా వివిధ ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ చర్యలు బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవలి వరకు డాలర్ వ్యాల్యూ ఇతర కరెన్సీలతో పోలిస్తే తగ్గింది. దీంతో బంగారం ధర పడిపోయింది. ఇప్పుడు కాస్త స్థిరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇండియాలో స్పాట్ గోల్డ్ మాత్రం రూ.500 వరకు పెరిగింది.

వారంలో 2.5 శాతం పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు అంతకుముందు పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ ధర 1,732.08 డాలర్లు పలికింది. ఈ వారంలో బంగారం ధర ఇప్పటి వరకు 2.5 శాతం పెరిగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 0.1 శాతం తగ్గి ఔన్స్ 1,738.60 డాలర్లు పలికింది. బ్రిటన్ ఎకానమీ ఏప్రిల్ నెలలో ఏకంగా 20.4 శాతం క్షీణించిందని డేటా వెల్లడైన నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.

అందుకే బంగారం ధర పెరిగింది
గత కొద్ది రోజుల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని, ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో తిరిగి ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పరిస్థితులు సానుకూలంగా ఉంటే బంగారం ధర రూ.46,500 వద్ద ఉంటుందని భావించారు. కానీ కరోనా రెండోసారి పుంజుకోవచ్చుననే వార్తలు, అమెరికా ఎకానమీ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చుననే అంచనాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడం వంటివి బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి.

3 నెలల్లో ఏకంగా 20 శాతం పెరిగింది
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మార్చి నెలలో 1451 డాలర్లు పలికింది. అప్పటి నుండి కరోనా కారణంగా పెరుగుతూ 1700 డాలర్లకు పైకి చేరుకుంది. గత వారంలో రుజ్లలో బంగారం ధరలు 2.5 శాతం పెరిగితే, మూడు నెలల్లో ఏకంగా 20 శాతచం పెరిగాయి. అంటే కరోనా కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు చమురు ధరలు పడిపోవడం కూడా బంగారంపై ఒత్తిడిని పెంచింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications