ఎంసీఎక్స్లో, హైదరాబాద్లో బంగారం ధర ఎలా ఉందంటే?
బంగారం ధరలు ఈరోజు సాయంత్రం (సోమవారం, సెప్టెంబర్ 21) సెషన్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ధర క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ రూ.590 (1.14 శాతం) తగ్గి రూ.51,125 పలికింది. బిజినెస్ టర్నోవర్ 8,395 లాట్లుగా ఉంది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.656 (1.09 శాతం) తగ్గి రూ.51,295 పలికింది. బిజినెస్ టర్నోవర్ 9,628 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.3,687.66 కోట్లు, రూ.446.86 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.539(1.04 శాతం) క్షీణించి రూ.51,225 కోట్లుగా ఉంది. బిజినెస్ టర్నోవర్ 15,073 లాట్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 20.02 డాలర్లు తగ్గి ఔన్స్ 1,930.50 డాలర్లు పలికింది.
బంగారం ధరలు ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.54,720, ముంబైలో రూ.51,340, చెన్నైలో రూ.53,860, కోల్తాలో రూ.53,400, బెంగళూరులో రూ.53,330 కోట్లుగా ఉంది. హైదరాబాద్లో రూ.53,860, కేరళలో రూ.51,940 పలికింది. పుణేలో రూ.51,340, అహ్మదబాద్ రూ.53,740 కోట్లుగా ఉంది. లక్నోలో రూ.54,720 కోట్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ట్రాయ్ ఔన్స్ 1,954.3 డాలర్లు పలికింది. గత 30 రోజుల క్రితంతో పోలిస్తే (1,946.5) 0.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 1.5 శాతం తగ్గి ట్రాయ్ ఔన్స్ 26.9 డాలర్లు పలికింది. ప్లాటినమ్ 0.96 శాతం పెరిగి 942 డాలర్లు పలికింది.