భారీగా పెరిగిన బంగారం ధరలు: పసిడి రూ.600, వెండి రూ.2,200 జంప్
బంగారం ధరలు నేడు (మే, 3 సోమవారం) భారీగా పెరిగాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47వేలు దాటి, రూ.47,500 దిశగా పరుగెడుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.618.00 (1.32%) పెరిగి రూ.47355.00, ఆగస్ట్ ఫ్యూచర్స్ రూ.609.00 (1.29%) ఎగిసి రూ.47660.00 వద్ద ట్రేడ్ అయింది. ఫ్యూచర్ గోల్డ్ ఓ సమయంలో రూ.47,450ని తాకి, రూ.47,500 దిశగా కనిపించింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.2వేలకు పైగా పెరిగి రూ.70వేల సమీపానికి చేరుకుంది. మే ఫ్యూచర్ రూ.2,220.00 (3.29%) పెరిగి రూ.69744.00 వద్ద, జూలై ఫ్యూచర్స్ రూ.2,624.00 (3.84%) పెరిగి రూ.70990.00 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు ఎగిసిపడ్డాయి. బంగారం ఔన్స్ 1800 డాలర్ల సమీపానికి వచ్చింది. వెండి 27 డాలర్లు దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ 25.25 (1.43%) డాలర్లు పెరిగి 1,792.95 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 1.144 (4.42%) డాలర్లు పెరిగి 27,017 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.