వరుసగా క్షీణించి... నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రూ.50,000 పైకి...
బంగారం, వెండి ధరలు శుక్రవారం(నవంబర్ 20) వరుసగా రూ.400, రూ.1,000 వరకు పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం గం.9.12 సమయానికి రూ.396.00 (0.79%) పెరిగి రూ.50,388.00 పలికింది. వరుసగా నాలుగు రోజుల పాటు క్షీణించిన బంగారం ధరలు, ఈ రోజు పెరిగాయి. ఉదయం రూ.50,041.00 ప్రారంభమై, రూ.50,435.00 గరిష్టాన్ని తాకి, రూ.49,857.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైం గరిష్టం రూ.56,200తో రూ.58,000 తక్కువగా ఉంది.
రూ.400 తగ్గిన పసిడి ఫ్యూచర్స్
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.388.00 (0.78%) పెరిగి రూ.50,400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,015.00 వద్ద ప్రారంభమై, రూ.50,450.00 గరిష్టాన్ని, రూ.49,928.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి ధరలు గత రెండు నెలలుగా రూ.49,500 నుండి రూ.52,000 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల చాలా రోజులుగా రూ.50,000 పైన పలికిన పసిడి, నిన్న ఆ మార్కు దిగువకు వచ్చింది.
రూ.1,000కి పైగా పెరిగిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.1000 వరకు పెరిగింది. కిలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.995.00 (1.62%) పెరిగి రూ.62,505.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,610.00 ప్రారంభం కాగా, రూ.62,750.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,560.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.1,032.00 (1.63%) పెరిగి రూ.64,315.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,450.00 వద్ద ప్రారంభమై, రూ.64,525.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,400.00 కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 15.45 (+0.83%) డాలర్లు పెరిగి 1,877 డాలర్ల వద్ద పలికింది. 1,859.30 - 1,879.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1861.50 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది పసిడి 24 శాతం మేర పెరిగింది.
ఔన్స్ వెండి ధర 0.370 (+1.54%) డాలర్లు పెరిగి 24.413 డాలర్లు పలికింది. ఈ రోజు 24.075 - 24.598 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.048 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది వెండి 38.53 శాతం పెరిగింది.