రెండ్రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం ధర, మరింత పెరిగేనా?

బంగారం ధరలు మంగళవారం (ఆగస్ట్ 18) పెరిగాయి. వరుసగా రెండు రోజుల్లో రూ.1500 వరకు పెరిగింది. ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 1 శాతం పెరిగి రూ.53,800 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 2 శాతం పెరిగి రూ.70,554 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి దాదాపు 2 శాతం పెరిగింది. వెండి 2.6 శాతం పెరిగింది. ఆగస్ట్ 7వ తేదీన బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.57,000 మార్క్ చేరుకున్న విషయం తెలిసిందే. వెండి రెండు రోజుల్లో దాదాపు రూ.3వేలు పెరిగింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధరలు తిరిగి 2000 డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ 0.23 శాతం క్షీణించడంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. వెండి ఔన్స్ 1 శాతం పెరిగి 27.69 శాతం పెరిగింది. ప్లాటినమ్ 0.9 శాతం పెరిగి 957.73 డాలర్లుగా ఉంది.

Gold Price Analysis: yellow metal up ₹1,500 in 2 days

అంతర్జాతీయ మార్కెట్లో గత పది సెషన్లలోనే పసిడి ధర రికార్డ్ ఔన్స్ 2,075, అలాగే కనిష్టం 1,863 డాలర్లు కూడా చూసింది. అంటే తక్కువ రోజుల్లో ఏకంగా 200 డాలర్ల మేర పెరిగి, తగ్గింది. ఇప్పుడు క్రమంగా మళ్లీ 2000 డాలర్లకు చేరుకుంది. పసిడి ధరలు తిరిగి 2030 నుండి 2033 డాలర్ల వద్దకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి పసిడికి అనుకూలంగా ఉంటే 2050 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+