బంగారంంపై మనకు ఉన్న పిచ్చే దేశాన్ని సర్వనాశనం చేస్తోంది.. ఆర్థిక వ్యవస్థకు అదే పెద్ద సవాల్ అంటున్న ఉదయ్ కోటక్

భారతదేశానికి బంగారంపై ఉన్న విపరీతమైన మోజు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారిందని.. ఇది అడ్డురాకపోతే భారత్ సులభంగా కరెంట్ అకౌంట్ మిగులును (Current Account Surplus) సాధించి ఉండేదని సీనియర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు జరిగిన 'విక్సిత్ భారత్ ఫైనాన్షియల్ మినిస్టర్-స్టేట్స్ కాన్ఫరెన్స్'లో ఆయన ప్రసంగించారు. మారుతున్న ప్రపంచ పరిణామాల మధ్య దేశం మరింత పటిష్టంగా నిలబడాలంటే భారతదేశం ఈ బంగారు చిక్కుముడిని వెంటనే విప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరిమాణంలో పెద్ద మార్పు లేకపోయినా దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతోందని ఉదయ్ కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు. 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు కరెంట్ అకౌంట్ లోటు (CAD) సుమారు 60 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని.. అదే సమయంలో Gold దిగుమతులే ఏకంగా 88 నుండి 90 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. Gold దిగుమతులు గనుక లేకపోతే భారత్ స్వయం సమృద్ధి సాధించి మిగులు ఖాతాను కలిగి ఉండేదని, అధిక ధరల వల్ల బాహ్య లోటును అదుపు చేయడం సవాలుగా మారుతోందని పేర్కొన్నారు.

Uday Kotak Uday Kotak gold puzzle gold imports India India gold import bill gold import bill 90 billion gold imports FY27 Uday Kotak reforms India gold demand gold demand India Gold Puzzle India current account deficit India external balance Uday Kotak gold comments India economy gold import costs 90

భారతదేశం ఇటీవలి కాలంలో సాధించిన అద్భుతమైన ఆర్థిక విజయాలను చూసి ఆత్మసంతృప్తి చెందవద్దని, ఇది విజయాన్ని ప్రకటించుకునే సమయం కాదని ఆయన హెచ్చరించారు. నేటి ప్రపంచ ఆర్థిక వాతావరణం చాలా పెళుసుగా ఉందని, అన్ని రంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ.. 7 శాతానికి పైగా ఉన్న ద్రవ్యలోటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అలాగే, మార్కెట్ ఆధారిత ఫైనాన్సింగ్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'మితిమీరిన ఫైనాన్షియలైజేషన్‌' (Over-financialization) కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

Also Read

ప్రపంచంలో చైనా సాధిస్తున్న భారీ వాణిజ్య మిగులును ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలో రెండు ప్రధాన అగ్రరాజ్యాలు ఉన్నాయని, అంతర్జాతీయ నియమాలు వేగంగా మారుతున్నాయని కోటక్ అన్నారు. ప్రైవేట్ సాంకేతిక కంపెనీలు సార్వభౌమ ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతున్నాయని వ్యాఖ్యానించారు. కెనడా వంటి దేశాలు గ్లోబల్ క్యాపిటల్ కోసం వేగవంతమైన సంస్కరణలు చేపడుతున్న విషయాన్ని ఉదాహరిస్తూ.. సంక్షోభాన్ని ఎప్పుడూ వృధా చేయవద్దు అనే సూక్తిని భారత్ పాటించాలని పిలుపునిచ్చారు. విక్సిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమతుల్యత (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమతుల్యత వంటిది) సాధిస్తూ.. రాష్ట్ర స్థాయిలో మరింత వేగవంతమైన సంస్కరణలు చేపట్టాలని ఉదయ్ కోటక్ స్పష్టం చేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+