Gold imports: 2021-22లో 3.45 లక్షల కోట్ల బంగారం దిగుమతులు
2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 33 శాతం పెరిగి, 46.14 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి.ఇది మన కరెన్సీలో దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 842 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారీ బంగారం దిగుమతుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 102.62 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి 192.41 బిలియన్ డాలర్లకు చేరింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 23 బిలియన్ డాలర్లు లేదా 2.7 శాతానికి చేరుకుంది. వ్యాల్యూమ్ పరంగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 842.28 టన్నులుగా నమోదయింది.