బంగారం ఎఫెక్ట్: 94.72 బిలియన్ డాలర్లకు తగ్గిన దేశ వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: కరెంట్ ఖాతా లోటు(CAD)కి కారణమవుతున్న బంగారం దిగుమతులు 9% తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ నెలకు వీటి విలువ 17.63 బిలియన్ డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో రూ.1.25 లక్షల కోట్లు. గత ఏడాది ఇధే సమయంలో 19.4 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.
కాల్స్, డేటా డిసెంబర్ 1 నుంచి ఇక భారం, కస్టమర్పై రూ.100 వరకు...
బంగారం దిగుమతి తగ్గి.. వాణిజ్య లోటు కూడా...
బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గింది. గత ఏడాది 116.15 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 94.72 బిలియన్ డాలర్లకు తగ్గింది. విదేశాల నుంచి బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. ప్రతి ఏడాది 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో జ్యువెల్లరీ పరిశ్రమ నుంచి బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది.
దిగుమతి తగ్గడానికి కారణాలు...
గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు పెరగడంతో పాటు ఇది కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది జూలై నుంచి బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదు అవుతోంది. అయితే అక్టోబర్ నెలలో మాత్రం 5 శాతం పెరిగి 1.84 బిలియన్ డాలర్లుగా ఉంది.
దిగుమతి సుంకం 4 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి
బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (GJEPC) విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 2% తగ్గి 1,830 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతులు 3% తగ్గి 3,280 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.