గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు జోరుగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలోను వరుసగా ఐదో నెల ఆగస్ట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో రూ.908 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా మహమ్మారి భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సహా అందరూ సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. దానికి తగినట్లుగానే పసిడి ధరలు గత ఆరు నెలల కాలంలో దాదాపు రూ.15వేల వరకు పెరిగింది. భౌతిక బంగారం కొనుగోలు తగ్గినప్పటికీ, బంగారంపై పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది.

రూ.5,356 కోట్ల పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ మాసం వరకు గోల్డ్ ఈటీఎప్లలోకి రూ.5,356 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించింది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. బంగారం ధరలు రికార్డ్ స్థాయికి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు తమ నిధుల్ని ఈక్విటీ మార్కెట్ నుండి బంగారం వంటి అతివిలవైన లోహాల వైపు మళ్లించినట్లు తెలిపింది. అయితే రష్యా వ్యాక్సీన్ వచ్చిన అనంతరం నుండి పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్లో రూ.51వేల సమీపానికి చేరుకుంది. గత నెలలో ఆగస్ట్ 7న గరిష్టంగా రూ.56,200 పైన పలికింది.

జూలైతో పోలిస్తే తక్కువ
ఆగస్ట్ నెలలో గ్లోడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లోకి రూ.908 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు పసిడిని తమ పోర్ట్పోలియోల్లోకి చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జూలై నెలలో రూ.921 కోట్లు వచ్చాయి. దీంతో పోలిస్తే మాత్రం తక్కువ కావడం గమనార్హం. అయితే నెల రోజులుగా ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో కాస్త తగ్గింది.

నెలవారీగా చూస్తే...
గోల్డ్ ఈటీఎఫ్ నిర్వహణలోని అసెట్ అండర్ మేనేజ్మెంట్(AUM) రూ.12,941 కోట్ల(జూలై) నుండి 4 శాతానికి పైగా పెరిగి రూ.13,503 కోట్లకు (ఆగస్ట్) చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి మాసంలో రూ.202 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1483 కోట్లు వచ్చాయి. మార్చిలో రూ.195 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్లో రూ.731 కోట్లు, మే నెలలో రూ.815 కోట్లు, జూన్ నెలలో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్ట్ నెలలో రూ.908 కోట్లు వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications