Go First: గోఫస్ట్ విమాన సంస్థకు అనుకూలంగా ఎన్సీఎల్టీ తీర్పు ప్రకటించినప్పటికీ కష్టాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ఎయిర్ క్రాఫ్ట్స్ లీజర్లు అప్పీలేట్ ట్రిబ్యునల్ కు వివాదాన్ని తీసుకెళ్లారు.
దివాలా తీసిన విమాన సంస్థకు చెందిన విమాన అద్దెదారులు SMBC ఏవియేషన్ క్యాపిటల్, SFV ఎయిర్క్రాఫ్ట్ హోల్డింగ్స్, GY ఏవియేషన్ వంటి ఎయిర్క్రాఫ్ట్ లీజర్లు తమ వాదనను వినిపించారు. ఎయిర్క్రాఫ్ట్ లీజర్ SMBC 26 ఫంక్షనల్ ఎయిర్క్రాఫ్ట్లను కలిగి ఉన్నప్పటికీ, భవిష్యత్తు తేదీల కోసం బుకింగ్లను తీసుకున్నప్పటికీ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా దాఖలు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించింది.

గో ఫస్ట్ నుంచి తమకు రూ.700-800 కోట్ల వరకు చెల్లించని బకాయిలు ఉన్నాయని SMBC ఏవియేషన్ పేర్కొంది. లా ట్రిబ్యునల్ (NCLT) తమ పక్షాన వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పించలేదని, మొత్తం పరిస్థితిని నిర్ధారించకుండానే దివాలా కోసం గో ఫస్ట్ అభ్యర్థనను అంగీకరించిందని వెల్లడించింది. మారటోరియం కంటే ముందే తాము లీజులను రద్దు చేశామని.. కానీ ట్రిబ్యునల్ ఆదేశం కారణంగా తాము విమానాలను స్వాధీనం చేసుకోలేకపోతున్నామని విమాన అద్దెదారు వాదించారు.
కేవలం లీజుకు తీసుకున్న విమానాన్ని నిర్వహించడానికి, ఛార్జీలు చెల్లించడానికి గో ఫస్ట్కి నెలకు 4.2 మిలియన్ డాలర్లను ఖర్చవుతుందని లీజింగ్ కంపెనీ SMBC వాదించింది. ఈ క్రమంలో తమ స్వంతం కాని ఆస్తులను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు గోఫస్ట్ ప్రయత్నిస్తోందని విమాన అద్దెదారులు వాదించారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాత్కాలిక నిషేధం కారణంగా విమానాల రిజిస్ట్రేషన్ను రద్దు చేయలేమని లీజర్లకు చెప్పినట్లు వాదించింది.


Click it and Unblock the Notifications