Harleen Deol: మహిళా క్రికెటర్ పెర్‌ఫార్మెన్స్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా: వండర్ విమెన్

ముంబై: ఇంగ్లాండ్ జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో టీ20 సిరీస్‌లో తలపడిన భారత జట్టు.. మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. విమెన్ క్రికెటర్ హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పట్టిన స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. నార్తాంప్టన్ కంట్రీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ- ప్రశంసలు సునామీ కురిసింది. మ్యాచ్ ఓటమి మిగిల్చిన నిరాశను తుడిచి పెట్టేసింది. అమీ జోన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చోటు చేసుకుందీ అద్భుతం.

19వ ఓవర్ వేసిన భారత పేసర్ శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా జోన్స్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద హర్లీన్ దాన్ని అందుకున్న తీరు హేమాహేమీలను సైతం కట్టి పడేసింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్.. సిక్స్‌గా వెళ్తోన్న ఆ బంతిని గాల్లోకి ఎగిరి అందుకుంది. ఈ క్రమంలో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయింది. బంతితో సహా బౌండరీ లైన్‌ లోపలికి వెళ్లబోయింది. దీన్ని గమనించిన వెంటనే హర్లీన్ డియోల్..మెరుపువేగంతో బంతిని బౌండరీకి ఇవతల గాల్లోకి విసిరేసింది.

 Gal Gadot; the real Wonder Woman is here, Anand Mahindra about Indias Harleen Deol

బౌండరీ లైన్ లోపల అడుగుపెట్టి.. మళ్లీ దాన్ని డైవ్ చేసి క్యాచ్‌గా అందుకుంది. ఈ ప్రయత్నంలో హర్లీన్ డియోల్ చేసిన జంప్.. నివ్వెరపోయేలా చేసింది. ఇది సాధ్యమేనా? అనిపించింది. కొన్ని అడుగుల మేర గాల్లోకి చిరుతపులిలా దూకిందామె. బంతి గ్రౌండ్‌కు చేరేలోపు దాన్ని అందుకుంది. హర్లీన్ డియోల్ క్యాచుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. డియోల్ పట్టిన క్యాచ్ చూసి మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

రియల్ సూపర్‌ ఉమెన్‌ అంటూ ఆనంద్ మహీంద్రా ఆమె ఆకాశానికెత్తేశారు. ఈ మేరకు ఆయన ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఈ క్యాచ్‌ను అందుకోగలుగుతుందని తాను ఏ మాత్రం ఊహించలేదని ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దాన్ని క్యాచ్‌గా మలచలేరని చెప్పారు. అలాంటి అద్భుతాన్ని రియల్ వండర్ విమెన్ చేసి చూపించారని ప్రశంసించారు. క్రికెట్ క్యాచుల్లో దీన్ని ద బెస్ట్‌ అని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి ఫీట్స్ పురుషులు ఆడే మ్యాచ్‌ల్లో అధికంగా కనిపిస్తుంటాయి. తాను వారికి ఏమాత్రం తక్కువ కాదని హర్లీన్ డియోల్ నిరూపించినట్టయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నటాలియా సివర్​, జోన్స్ రాణించారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజ‌్‌లోి దిగిన భారత్ జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 54/3తో నిలిచిన దశలో వర్షం పడింది. దీనితో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+