కేంద్రంపై సన్నగిల్లుతున్న ఆశలు..!!

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. మొన్నటివరకు 100 డాలర్లకు చేరువగా కనిపించిన క్రూడాయిల్ రేటు ఇవ్వాళ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 91.46 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 85.55 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. మొన్నటివరకు ఈ రెండింటి ధరలు 94 నుంచి 99 డాలర్ల వరకు వెళ్లాయి.

తగ్గింపుపై..

తగ్గింపుపై..

క్రూడాయిల్ ఉత్పత్తిని రెండు మిలియన్ బ్యారెళ్లకు ఒపెక్ ప్లస్ దేశాలు తగ్గించిన నేపథ్యంలో- వాటి రేట్లు క్రమగా పెరగడం మొదలు పెట్టాయి. అక్కడ పరిస్థితులు కుదుటపడటంతో ధర దిగి వస్తోంది. ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెట్రో రేట్లను పెంచుకుంటూ పోయాయి ఆయిల్ కంపెనీలు. రేటు తగ్గుతోండటం వల్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది కేంద్రం మీదే డిపెండ్ అయి ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రంపై ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

15 రోజుల్లో నిర్ణయం..

15 రోజుల్లో నిర్ణయం..

15 రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇదివరకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో పర్యటిస్తోన్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించే అవకాశం ఉంది. కాగా ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది.

అవే రేట్లు..

అవే రేట్లు..

ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది.

వ్యాట్ తగ్గింపుపై..

వ్యాట్ తగ్గింపుపై..

తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.

మళ్లీ ఆశలు..

మళ్లీ ఆశలు..

మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది. ఇప్పుడు నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనలో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.. వాహనదారుల్లో.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+