For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ ఊరట: నేలకు దిగుతున్న క్రూడాయిల్ ధర: మరోసారి పెట్రోల్, డీజిల్‌పై రాయితీకి కేంద్రం సై?

|

ముంబై: అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు 100 డాలర్ల వరకు పలికిన క్రూడాయిల్ బ్యారెల్ రేటు.. ఇప్పుడు మరింత తగ్గింది. 95 డాలర్ల కంటే దిగువకు చేరింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 94.17 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ రేటు మరింత తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ రేటు 93.09 వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లింది.

మరో రాయితీ?

మరో రాయితీ?

క్రూడాయిల్ బ్యారెల్ ధర తగ్గుముఖం పట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో..దేశీయ ఆయిల్ కంపెనీలపై కొంతమేర భారం తగ్గినట్టయింది. దాన్ని వాహనదారులకు బదలాయించాలనే డిమాండ్ ఉంది. తగ్గుతున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా వాటి రేట్లను సవరించాలంటూ పలువురు ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం దేశ రాజధానిలో నెలకొని ఉంది.

పాతధరలే..

పాతధరలే..

చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.

 వ్యాట్ తగ్గింపు..

వ్యాట్ తగ్గింపు..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.

ఈ రాష్ట్రాల్లో..

ఈ రాష్ట్రాల్లో..

రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.

English summary

భారీ ఊరట: నేలకు దిగుతున్న క్రూడాయిల్ ధర: మరోసారి పెట్రోల్, డీజిల్‌పై రాయితీకి కేంద్రం సై? | Fuel price on July 25, 2022: check today's Petrol and diesel rates in your city

Fuel price on July 25, 2022: check today's Petrol and diesel rates in your city.
Story first published: Monday, July 25, 2022, 7:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X