ఆధునిక క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మ్యాచ్లు ట్రోఫీల కంటే కూడా చాలా విలువైనవిగా చెప్పుకోవచ్చు. అవి కేవలం ఫలితాన్ని మాత్రమే నిర్ణయించవు. మొత్తం టోర్నమెంట్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇది షెడ్యూల్లోని మరో మ్యాచ్ మాత్రమే కాదు.. టోర్నమెంట్ను నడిపించే బలమైన ఆర్థిక ఇంజిన్ గా చెప్పవచ్చు. ప్రసార హక్కుల విలువ నుంచి స్పాన్సర్షిప్ ఆదాయం వరకు, చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధుల పంపిణీ వరకు.. ఈ ఒక్క మ్యాచ్పై ఐసీసీ ఆశలు ఆధారపడి ఉంటాయి.
ఇలాంటి కీలక సమయంలో Pakistan ప్రభుత్వం తమ జట్టుకు ప్రపంచకప్లో పాల్గొనే అనుమతి ఇచ్చినా.. భారత్తో మ్యాచ్ ఆడే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. దీనిపై స్పందించిన ఐసీసీ, ఇది కేవలం రాజకీయ అంశం కాదని, దీని వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు, ఒప్పంద బాధ్యతలు ఉన్నాయని హెచ్చరిక రూపంలో ప్రకటన విడుదల చేసింది.

రూ.4,500 కోట్ల మ్యాచ్: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఒక్క టీ20 మ్యాచ్ విలువ దాదాపు 500 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.4,500 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ప్రసార హక్కులు, టీవీ-డిజిటల్ ప్రకటనలు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, టికెటింగ్, హాస్పిటాలిటీ, బెట్టింగ్ వంటి అన్ని వాణిజ్య కార్యకలాపాలను కలిపితే ఈ స్థాయి ఆదాయం సమకూరుతుంది. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కీ ఇంతటి ఆర్థిక విలువ ఉండదన్నది కఠోర వాస్తవం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 సెకన్ల యాడ్ స్లాట్కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలకడం సాధారణమే. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే, మొత్తం టోర్నమెంట్ ఆర్థిక లెక్కలే మారిపోయే ప్రమాదం ఉంది.
నష్టాల ప్రభావం ఎవరిపై?: మ్యాచ్ రద్దయితే తక్షణమే అతిపెద్ద నష్టాన్ని చవిచూసేది ప్రసార హక్కులు పొందిన సంస్థలే. ఒక్క మ్యాచ్తోనే వారికి దాదాపు రూ.300 కోట్ల ప్రకటనల ఆదాయం దూరమవుతుంది. ఇప్పటికే నష్టాల కారణంగా జియోస్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు ఐసీసీ నుంచి రాయితీలు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అయితే, వారి వాదనకు మరింత బలం చేకూరుతుంది. అంతర్గత లెక్కల ప్రకారం.. ప్రపంచకప్లో ఒక్కో మ్యాచ్ సగటు విలువ రూ.138.7 కోట్లుగా ఉంటుంది.
ప్రసారకర్తల ఒత్తిడి పెరిగితే, ఆ ఆర్థిక భారాన్ని ఐసీసీ భరించాల్సి వస్తుంది. ఫలితంగా సభ్య దేశాలకు పంచే ఆదాయంలో కోత పడుతుంది. దీని ప్రభావం భారత్, పాకిస్థాన్తో పాటు ఐసీసీ నిధులపై ఆధారపడే చిన్న దేశాల క్రికెట్ బోర్డులపై తీవ్రంగా ఉంటుంది. అంచనాల ప్రకారం.. మ్యాచ్ రద్దయితే భారత్, పాకిస్థాన్ బోర్డులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరో రూ.200 కోట్ల నష్టం వాటిల్లుతుంది.
పాకిస్థాన్కు పెను ప్రమాదం: ఐసీసీ మొత్తం ఆదాయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు 5.75 శాతం వాటా లభిస్తుంది. ఇది ఏడాదికి సుమారు 34.51 మిలియన్ డాలర్లు అని చెప్పవచ్చు. ఈ నిధులు నిరంతరం రావాలంటే ఐసీసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. స్వచ్ఛందంగా మ్యాచ్కు దూరంగా ఉంటే అది 'ఫోర్స్ మేజర్' కిందకు రాదు. ఫలితంగా బీమా రక్షణ ఉండదు, చట్టపరమైన మినహాయింపులు వర్తించవు. టోర్నమెంట్ చెల్లింపులను నిలిపివేయడం, జరిమానాలు విధించడం, ప్రసారకర్తల దావాలను ఎదుర్కోవడం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి.
ఆర్థిక నష్టాలకన్నా ప్రమాదకరమైనది ప్రతిష్ఠకు కలిగే భంగం. పాకిస్థాన్ మ్యాచ్లు 'రిస్క్ అసెట్స్'గా మారితే, భవిష్యత్తులో ప్రసార హక్కుల విలువ పడిపోతుంది, స్పాన్సర్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ఒక్క మ్యాచ్ను వదులుకోవడం వల్ల కలిగే నష్టం రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు పీసీబీని వెంటాడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్ కోసం ముందుగానే విమానాలు, హోటళ్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానుల నష్టం మాత్రం వర్ణనాతీతమేనని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కేవలం క్రికెట్ కాదు. అది ప్రపంచ టోర్నమెంట్లను ఆచరణీయంగా ఉంచే ఆర్థిక శక్తి. ఈ మ్యాచ్ను వదులుకోవడం ఒక్క ప్రపంచకప్ను మాత్రమే కాదు..ప్రపంచ క్రికెట్ వ్యవస్థనే కుదిపేస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications