జీతం రూ. 15 వేలు, రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు.. ఏసీబీ అధికారులే బిత్తరపోయేలా కర్ణాటక మాజీ క్లర్క్ అవినీతి

కర్ణాటక రాష్ట్రంలో అవినీతి తిమింగళం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ ప్రభుత్వ మాజీ ఉద్యోగి అక్రమంగా సంపాదించిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే బిత్తరపోయారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌ (KRIDL) సంస్థలో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన కలకప్ప నిడగుండి అనే అవుట్‌సోర్స్డ్ క్లర్క్‌ అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటూ అతను ఏకంగా రూ. 30 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

గురువారం ఉదయం 6 గంటల నుంచి.. కొప్పల్‌లోని నిడగుండి నివాసంపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో బయటపడిన ఆయన ఆస్తులు చూసి అందరూ నోరెళ్లబెట్టారు. మొత్తం 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 1 కిలోకు పైగా బంగారం, ఇంకా వాహనాలు ఏసీబీ దాడుల్లో బయటకు వచ్చాయి. మరికొన్ని ఆస్తులు ఆయన భార్య, సోదరుల పేర్ల మీద నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

Karnataka clerk corruption Rs 15000 salary Rs 30 crore assets government employee black money ACB raid Karnataka 2025 disproportionate assets case corrupt babu India 1kg gold seized 24 houses clerk farmland corruption case Indian bureaucracy scams Karnataka ex-babu raid income vs wealth scam public servant property scam 15 30 2025 disproportionate assets case 24

ఈ దాడులు KRIDLలో రూ.72 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులపై జరిగినవని అధికారులు చెబుతున్నారు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జరనప్ప చించోలికర్, నిడగుండిపై ఇద్దరు KRIDL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అనిల్ పాటిల్, ఆనంద్ కర్లకుంటి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో మురుగు నీటి పారుదల, రోడ్లు, తాగునీటి పనులకు సంబంధించి 96 ప్రాజెక్టులపై నకిలీ పత్రాలు, ఇన్‌వాయిసులు సృష్టించారు.

ఈ స్కాంలో కనకగిరి, గంగావతి, యెల్బుర్గ, కొప్పల్ తాలూకాల్లో పెద్ద మొత్తంలో మంజూరైన గ్రాంట్లు వేరే దారికి మళ్లించారు. దాడులకు ముందు నిడగుండిని ఉద్యోగం నుంచి తొలగించగా.. చించోలికర్ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. రూ. 15 వేల జీతగాడు ఈ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం ఏంటని విస్తుపోతున్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు రెడీ అయింది. కొప్పల్ ఎమ్మెల్యే కె. రాఘవేంద్ర హిట్నాల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నిడగుండితో పాటు సిమెంట్ సరఫరాదారు అమరేష్ యంబలదిన్నిల ప్రమేయం ఉందని తెలిపారు.

ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపడుతుందని తెలిపారు. నేరం రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం జీతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు అంచనాలు వేసే కాలం పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+