కర్ణాటక రాష్ట్రంలో అవినీతి తిమింగళం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ ప్రభుత్వ మాజీ ఉద్యోగి అక్రమంగా సంపాదించిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే బిత్తరపోయారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL) సంస్థలో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన కలకప్ప నిడగుండి అనే అవుట్సోర్స్డ్ క్లర్క్ అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటూ అతను ఏకంగా రూ. 30 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
గురువారం ఉదయం 6 గంటల నుంచి.. కొప్పల్లోని నిడగుండి నివాసంపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో బయటపడిన ఆయన ఆస్తులు చూసి అందరూ నోరెళ్లబెట్టారు. మొత్తం 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 1 కిలోకు పైగా బంగారం, ఇంకా వాహనాలు ఏసీబీ దాడుల్లో బయటకు వచ్చాయి. మరికొన్ని ఆస్తులు ఆయన భార్య, సోదరుల పేర్ల మీద నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ దాడులు KRIDLలో రూ.72 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులపై జరిగినవని అధికారులు చెబుతున్నారు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జరనప్ప చించోలికర్, నిడగుండిపై ఇద్దరు KRIDL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అనిల్ పాటిల్, ఆనంద్ కర్లకుంటి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో మురుగు నీటి పారుదల, రోడ్లు, తాగునీటి పనులకు సంబంధించి 96 ప్రాజెక్టులపై నకిలీ పత్రాలు, ఇన్వాయిసులు సృష్టించారు.
ఈ స్కాంలో కనకగిరి, గంగావతి, యెల్బుర్గ, కొప్పల్ తాలూకాల్లో పెద్ద మొత్తంలో మంజూరైన గ్రాంట్లు వేరే దారికి మళ్లించారు. దాడులకు ముందు నిడగుండిని ఉద్యోగం నుంచి తొలగించగా.. చించోలికర్ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. రూ. 15 వేల జీతగాడు ఈ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం ఏంటని విస్తుపోతున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు రెడీ అయింది. కొప్పల్ ఎమ్మెల్యే కె. రాఘవేంద్ర హిట్నాల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నిడగుండితో పాటు సిమెంట్ సరఫరాదారు అమరేష్ యంబలదిన్నిల ప్రమేయం ఉందని తెలిపారు.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపడుతుందని తెలిపారు. నేరం రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం జీతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు అంచనాలు వేసే కాలం పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications