కరోనా వైరస్ ఎఫెక్ట్, భారత వృద్ధి రేటును భారీగా తగ్గించిన రేటింగ్ సంస్థలు
భారత జీడీపీ వృద్ది రేటు 4.9 శాతంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ కారణంగా బలహీన డొమెస్టిక్ డిమాండ్, సరఫరాలో అంతరాయం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను సవరించింది. అంతకు ముందు 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా భయాల నేపథ్యంలో కోత విధించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) అంచనాలకు కూడా ఫిచ్ రేటింగ్స్ కోత పెట్టింది. దీనిని 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. యూబీఎస్ కూడా 5.7 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉండటంతో తయారీ రంగంపై ఒత్తిడి పెరగనుందని, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కంపెనీలకు సరఫరా అడ్డంకులు ఎదురుకావొచ్చని పేర్కొంది.
ఇండియా డైమండ్ పరిశ్రమపై కరోనా వైరస్ భారీ దెబ్బ
కాగా, కరోనా ప్రభావంతో జనవరి-మార్చి త్రైమాసిక వృద్ధికి 0.2 శాతం మేర గండిపడవచ్చని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత జీడీపీ వృద్ధి అంచనాను 5.1 శాతానికి సవరించినట్లు ఓఈసీడీ ప్రకటించింది. గతంలో 6.2 శాతంగా అంచనా వేసింది.