income tax: తాజా బడ్జెట్ సమావేశాల్లో వేతన జీవులకు కేంద్రం ఉపశమనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను రాయితీ లిమిట్ ను 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల లోపు సంపాదిస్తున్న వారు ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదన్న మాట. మరి 7 లక్షల 100 రూపాయల సేలరీ ఉంటే పన్ను కట్టాల్సిందే. సరిగ్గా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
పరిమితికి ఎగువనున్నది చెల్లిస్తే చాలు:
2023-24 నుంచి కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్నుపై ఉన్న రాయితీ పరిధిని కేంద్ర ఆర్థిక శాఖ 7 లక్షలకు పెంచింది. అయితే ఆ పరిధికి మించి స్వల్పంగా అధిక జీతం పొందుతున్నవారు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే 7 లక్షలకు పైగా అతికొద్ది మొత్తం సంపాదిస్తున్న వారు.. ఆపై విలువ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. కానీ దీనిపై ఓ నిర్ధిష్ట లిమిట్ ను మాత్రం కేంద్రం ప్రకటించలేదు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రూ.7,27,777 ఆదాయమున్న వ్యక్తులు ఈ ఉపశమంతో ప్రయోజనం పొందనున్నట్లు తెలుస్తోంది.

ఇలా అర్థం చేసుకోవాలి:
ఉదాహరణకు ఓ వ్యక్తి సంవత్సర ఆదాయం 7 లక్షలు అనుకుంటే, ఏప్రిల్ 1 అనంతరం అతడు ఆదాయపు పన్ను పరిధిలోకి రాడు. తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అదే వ్యక్తి ఆదాయం 7 లక్షల 100 అనుకుంటే, అతడు 25 వేలకు పైగా పన్ను కట్టాల్సి వస్తుంది.
అంటే ఆదాయంలో కేవలం 100 పెరగడం వల్ల 25 వేలు అదనంగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజా నిబంధన ప్రకారం.. 7 లక్షల 100 జీతం పొందుతున్న వ్యక్తి కేవలం ఆపై 100 ట్యాక్స్ గా చెల్లిస్తే సరిపోతుందన్నమాట.
న్యూ రెజీమ్ కు మార్చేందుకే..
నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తంగా ఉద్యోగులను పాత పన్ను విధానం నుంచి కొత్త పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తాజా బడ్జెట్ లో పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురాకపోగా.. ఓల్డ్ రెజీమ్ లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను సైతం కొత్త విధానానికీ వర్తింపజేయడమే దీనికి నిదర్శనం. 5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారిపైనా పన్నుపోటు తగ్గించి ఇటువైపు ఆకర్షించడానికి మోడీ సర్కారు ప్లాన్ చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications