తిరువనంతపురం: దేశాన్ని చుట్టుముట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత లక్షలాదిమందిని రోడ్డున పడేసింది. లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల పలువురు తమ ఉపాధిని కోల్పోయారు..రోడ్డున పడ్డారు. ఆర్థిక రంగం ఎత్తుపల్లాలను ఎదుర్కొంటోంది. గతుకుల రోడ్ల మీద సాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినప్పటికీ.. అది మిగిల్చిన సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదం లేకపోలేదు. లాక్డౌన్ వల్ల మూతపడిన పరిశ్రమలు, చిన్న తరహా తయారీ యూనిట్లు మళ్లీ గాడిన పడాలంటే మార్కెట్ పుంజుకోవాల్సి ఉంటుంది. పూర్వవైభవాన్ని సంతరించుకోవాల్సి ఉంటుంది.

ఫెడరల్ బ్యాంక్ సరికొత్త చర్యలు..
అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) సరికొత్త చర్యలు తీసుకుంది. వందల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పార్ట్టైమ్ ఉద్యోగాలను సృష్టించింది ఫెడరల్ బ్యాంక్. నిరుద్యోగులకు వాటిని కేటాయించింది.. రిక్రూట్ చేసుకుంది కూడా. ఇప్పటిదాకా 400 మందికి పైగా యువతకు ఉపాధిని కల్పించినట్లు ప్రకటించింది. కేరళ వ్యాప్తంగా ఉన్న తమ శాఖా కార్యాలయాల్లో వారిని నియమించినట్లు వివరించింది.

400 మందికి పైగా పార్ట్టైమ్ జాబ్స్..
పార్ట్టైమ్ ఉద్యోగాల కింద 400 మందికి పైగా ఉపాధిని కల్పించామని, వారందరినీ కోవిడ్ వార్డెన్స్గా హోదా కల్పించినట్లు ఫెడరల్ బ్యాంక్ ముఖ్య మానవ వనరుల విభాగాధిపతి అజిత్ కుమార్ కేకే తెలిపారు. ప్రతి నెలా 18 వేల రూపాయల మొత్తాన్ని వేతనంగా అందజేయనున్నట్లు చెప్పారు. దీనికోసం ఆరు కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద దీన్ని చేపట్టామని పేర్కొన్నారు. బ్యాంకు కార్యాలయాలకు వచ్చే ఖాతాదారులను క్రమబద్దీకరించడం, వారికి మాస్కులు, శానిటైజర్లను అందించడం వారి డ్యూటీగా నిర్దారించామని అన్నారు.

సీఎస్ఆర్ కింద రూ.40 కోట్లు
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మొత్తం 35 కోట్ల రూపాయలను కేటాయించామని, ఇందులో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో 100 ఐసీయూ బెడ్స్ను ఆసుపత్రులకు అందజేసినట్లు వివరించారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అయిదు జిల్లాల్లో సంజీవినీ వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వాటి ద్వారా టీకాపై ప్రచారం చేస్తోన్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-2022లో ఈ మొత్తాన్ని 40 కోట్ల రూపాయల మేరకు పెంచాలని నిర్ణయించినట్లు అజిత్ కుమార్ కేకే తెలిపారు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications