EPFO రూ.80,000 బంపర్ ఆఫర్: ఇదో ఫేక్ న్యూస్.. జాగ్రత్త
ఫేక్ న్యూస్, సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. తాజాగా, ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000 బహుమతి ఇస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.
ఈపీఎఫ్ఓ కస్టమర్లకు సూపర్ ఆఫర్ అని, ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్యకాలంలో పని చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని, దానిని పొందాలంటే కింద ఇచ్చిన లింక్లో మీ వివరాలు తెలియజేయాలని వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఖాతాదారులకు రూ.80వేలు బహుమతి ఇస్తోందని ఆ ఫేక్ సందేశంలో ఉంది. అయితే తాము ఎలాంటి ఆఫర్లు అందించడంలేదని ఈపీఎఫ్ఓ తెలిపింది.
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్న్యూస్!: హోంలోన్ తీసుకుంటే రూ.50,000 ప్రయోజనం?
దీనిపై పలువురు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రావిడెంట్ సంస్థ ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలిపింది. ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ కాల్స్, సందేశాలకు స్పందించరాదని ఖాతాదారులకు సూచించింది. ఇలాంటి మెసేజ్ 2018లోను వైరల్ అయింది.