వేతనజీవులకు చేదువార్త. ఈసారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వడ్డీ రేట్లు తగ్గించే అంశంపై పరిశీలిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి అంటే 15 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.

వడ్డీ రేటు యథాతథంగా ఉండకపోవచ్చు
పెట్టుబడులపై లాభాలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీస్ పైన లాభాలు గత ఏడాది కాలంగా 50 నుంచి 80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గడంతో ఈపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండకపోవచ్చు.

ఈ రెండు కంపెనీల్లో పెట్టుబడులు
దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈపీఎఫ్ఓ రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ రెండు సంస్థల దివాళా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సొమ్ము ప్రస్తుతం రికవరీ అయ్యే అవకాశాలు లేవు.

మార్చి 5న సీబీటీ సమావేశం
మార్కెట్లలో EPFO మొత్తంగా రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్ట్ చేసింది. వీటిలో 85% నిధులను డెట్ మార్కెట్లలో, మరో 15% నిధుల్ని ఈటీఎఫ్ ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. దీంతో ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు గత ఏడాది మార్చి నాటికి 14.74% లాభాలతో రూ.74,324 కోట్లకు చేరాయి. కాగా, పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు తుది నిర్ణయానికి ముందు గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వోకు వచ్చిన రాబడులపై ఎఫ్ఐఏసీ పరిశీలన చేసి, ఆ తర్వాత సీబీటీ పీఎఫ్ వడ్డీరేటు సమీక్షపై చర్చిస్తుంది. సీబీటీ సమావేశం మార్చి 5న జరగనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications