ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం జమ చేసే నిధిని కాపాడుతూ వస్తున్న ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ఒక ఉద్యోగి అనుకోకుండా మరణిస్తే, ఆతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో వారికి కొంత సహాయం అందించాలని EPFO అనేక ఏళ్లుగా ఒక ఎక్స్గ్రేషియా (మరణ ఉపశమనం) స్కీమ్ అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ మొత్తాన్ని రూ. 8.8 లక్షలుగా నిర్ణయించారు. అయితే కాలం మారింది... దాంతో పాటుగా ఖర్చులు పెరిగాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, EPFO తన సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా మరింతగా అండగా నిలవాలని నిర్ణయించింది.
2025 ఏప్రిల్ 1 నుండి, EPFO మరణాంతర సాయాన్ని రూ. 8.8 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచింది. అంటే, ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే, ఆయన కుటుంబం లేదా చట్టబద్ధమైన వారసుడు ముందుకన్నా ఎక్కువ మొత్తాన్ని పొందనున్నారు.
ఈ సహాయం మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి (Staff Welfare Fund) నుంచి చెల్లిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగులు.. ఇలా మూడు వర్గాల ప్రతినిధులు ఉంటారు.

ఇక ఈ సహాయం మొత్తాన్ని ఒక స్థాయిలో నిలిపివేయకుండా, 2026 ఏప్రిల్ 1 నుండి ప్రతి ఏడాది 5% పెరుగుదల ఇవ్వాలని కూడా EPFO నిర్ణయించింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఎంత పెరిగినా, ఈ సాయం కుటుంబాలకు నిజంగా ఉపయోగపడేలా ఉంటుంది. కేవలం మొత్తాన్ని పెంచడమే కాదు, EPFO కుటుంబాలకు ఈ డబ్బు చేరే విధానాన్ని కూడా సులభతరం చేసింది.
గార్డియన్షిప్ సర్టిఫికెట్ అవసరం లేదు: ఉద్యోగి మరణించి, ఆయన PF మొత్తాన్ని మైనర్ పిల్లలకు ఇవ్వాల్సి వస్తే, ఇంతవరకు గార్డియన్షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీని వలన డబ్బు రావడానికి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఆ షరతును ఎత్తివేశారు. దీంతో కుటుంబానికి డబ్బు త్వరగా చేరుతుంది.
ఆధార్ అప్డేట్ సులభతరం: PF ఖాతా నంబర్ (UAN) తో ఆధార్ లింక్ చేయని లేదా ఆధార్లో పొరపాట్లు ఉన్నవారు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియను EPFO మరింత సులభతరం చేసి వేగవంతం చేసింది. ఆధార్ వివరాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవరించుకోవచ్చు.
కుటుంబాలకు నిజమైన భరోసా: ఈ నిర్ణయం వల్ల ఉద్యోగి ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం ఆర్థికంగా కూలిపోకుండా ఉండేందుకు పెద్ద అండ లభించనుంది. రూ. 15 లక్షలతో పాటు ప్రతి సంవత్సరం 5% పెరుగుదల ఉండటంతో, భవిష్యత్తులో ఈ సాయం విలువ తగ్గకుండా ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications