కొత్తగా ఉద్యోగంలో చేరాలని కోరుకుంటున్న వారికి శుభవార్త! గత క్యాలెండర్ ఏడాది (2021) రెండో అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ క్యాలెండర్ సంవత్సరం (2022) మొదటి అర్ధ సంవత్సరంలో 30 శాతం ఎక్కువ నియామకాలు చేపట్టనున్నాయి కంపెనీలు. ఈ మేరకు కొత్తవారిని తీసుకోనున్నారు. ఐటీ, టెలికం, ఈ-కామర్స్ వ్యాపారాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టీమ్లీజ్ ఎడ్టెక్ విడుదల చేసిన కెరీర్ ఔట్ లుక్ రిపోర్ట్ ప్రకారం 2021 జూలై-డిసెంబర్ కంటే 2022 జనవరి - జూన్ కాలంలో 30 శాతం ఎక్కువగా ఫ్రెషర్స్ను తీసుకోనున్నారు. అలాగే, క్రితం అర్ధ సంవత్సరంలో కేవలం 17 శాతం కంపెనీలు మాత్రమే ఫ్రెషర్స్ పైన దృష్టి సారించగా, ప్రస్తుత అర్ధ సంవత్సరంలో అది 47 శాతం కంపెనీలకు పెరిగింది.

ఐటీ అదుర్స్
ఐటీ రంగం ఎక్కువ మంది ఫ్రెషర్స్ను తీసుకోవడానికి ఆసక్తిగా ఉంది. 57 శాతం మందిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రాంతాలవారీగా చూస్తే బెంగళూరు 59 శాతంతో మొదటి స్థానంలో ఉండనుంది. ఆ తర్వాత ముంబై (43 శాతం), ఢిల్లీ (39 శాతం) ఉంటాయి. ఐటీ తర్వాత ఇతర రంగాల విషయానికి టెలికం, ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయి. హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాల్లో నియామకాలు 2 శాతం పెరిగింది. అన్ని రంగాల్లో ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ హైరింగ్ గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 31 శాతం నుండి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యర్థుల విద్యానైపుణ్యాలతో పాటు వ్యక్తిగత లక్షణాలను కంపెనీలు పరిగణలోకి తీసుకుంటున్నాయి.

డిమాండ్ వీటికే
నిర్మాణం, రియాల్టీ, వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, మీడియా, వినోద రంగాల్లోని కంపెనీలలో నియామకాలపై ఆసక్తి తగ్గింది.
డేటా అనలటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్, వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లై చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్లు అయితే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోవడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఐటీలో వలసల ఆందోళన
ఐటీ పరిశ్రమలో వలసలు ఆందోళనగా ఉండటంతో నైపుణ్యం, ప్రతిభ కలిగిన ఉద్యోగులు చేజారిపోకుండా చాలా సంస్థలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా వేతన పెంపు, ఇతర ఇన్సెంటివ్స్, పదోన్నతులు ఇస్తున్నాయి. ఉద్యోగులవారీగా 8 శాతం నుండి 20 శాతం వరకు వేతన పెంపు ఉంది.
ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 19 శాతం నుండి 21 శాతం మేర వృద్ధి చెంది 23,000 నుండి 24,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications