చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీకి ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు షియోమీ,ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ), డైరెక్టర్ సమీర్ బి రావు, మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) మను కుమార్ జైన్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. 5,551 కోట్లకు సంబంధించి మూడు విదేశీ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఫెమా నిబంధనలు ఉల్లంగించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు చెప్పింది.
అడ్జుడికేటింగ్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) FEMAలోని సెక్షన్ 16 కింద Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు, సిటీ బ్యాంక్, HSBC బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్ AGకి నోటీసులు ఇచ్చింది. నిందితులు ఉల్లంఘనకు పాల్పడినట్లు నిరూపితమైతే మొత్తానికి మూడు రెట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

షియోమీతో పాటు జైన్, రావులకు కూడా నోటీసులు పంపినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అక్రమ చెల్లింపులకు సంబంధించి షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. ఆ సంస్థకు సంబంధించి రూ.5,551.27 కోట్లను ఫ్రీజ్ చేసింది.
మూడు విదేశీ బ్యాంకులకు కూడా రూ.5,551 కోట్లు చెల్లించాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. షియోమీ ఇండియా 2015 సంవత్సరం నుంచి తన మాతృ సంస్థకు డబ్బు పంపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. Xiaomi ఇండియా భారతదేశంలో పని చేయడం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఈ డబ్బును పంపడం ప్రారంభించిందని విచారణలో తేలినట్లు తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications