కరోనా తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం రూపంలో భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా కాస్త ఎదురుగాలి ఉన్నప్పటికీ, 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) ఆరేళ్ల కనిష్టానికి చేరాయని పేర్కొంది. అలాగే, రుణాలకు డిమాండ్ పెరుగుతుందని వెల్లడించింది.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన ఉత్పత్తుల ధరలు, ముఖ్యంగా పెరిగిన ముడి చమురు ధరలు, అస్థిర ఆర్థిక పరిస్థితులు ప్రపంచ, భారత మార్కెట్లను అశాంతికి గురి చేస్తున్నాయి. ఈ ప్రభావం భారత్ పైన ఉంది. ఇక కార్పోరేట్ అమ్మకాలు, లాభదాయకత పెరిగినప్పటికీ కాపెక్స్ సైకిల్ అస్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక సమస్యలను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, పరిస్థితిని సునిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఆర్బీఐ తన 25వ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పలు అంశాలను పొందుపరిచింది. ప్రతికూల పరిణామాలను తట్టుకోవడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వద్ద సరిపడా మూలధన నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్భణానికి కళ్లెం వేసేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపులు, కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2022 మార్చికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల సీఆర్ఏఆర్ కొత్త గరిష్టమైన 16.7 శాతానికి చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications