వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం సరికొత్త చర్య
కేంద్ర ప్రభుత్వం వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త కంపెనీలను, సంస్థలను భారత్లో ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఉన్న SPICe (సింప్లిఫైడ్ ప్రోఫార్మా ఫర్ ఇన్కార్పోరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ) స్థానంలో SPICe+ని తీసుకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కంపెనీలు నమోదు చేసుకునేందుకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఫారంను అందుబాటులోకి తేనుంది.
ప్రైవేటు రైళ్ల రేసులో టాటా, అదానీ, హ్యుండాయ్: ధరలు ఆ సంస్థల ఇష్టం!
దీంతో పాటు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా వెంటనే జారీ చేయనుంది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ SPICe+ పేరుతో పది సేవలను అందించనుంది. ప్రస్తుతం SPICe స్థానంలో ఈ కొత్త విధానం రానుంది.
సరికొత్త విధానం ద్వారా భారతదేశంలో వ్యాపార చేయాలనుకునే వారికి అందుకు సంబంధించిన ప్రక్రియ మరింత సులభతరమై సమయం ఆదా అవుతుందని కార్పోరేట్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.