అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు పరస్పర సుంకాన్ని ప్రకటించారు. మొత్తంగా చూస్తే 185 దేశాల నుండి అమెరికాకి వచ్చే వస్తువులపై ఈ సుంకాలు విధించారు. కాగా అమెరికా చరిత్రలోనే ఈ విధంగా భారీ సుంకాలు విధించడం తొలిసారి. దీని ద్వారా అమెరికా ప్రతి సంవత్సరం $600 బిలియన్లు సంపాదిస్తుందని అంచనా. భారతదేశం ఇకపై అమెరికాకు వస్తువులను పంపేటప్పుడు 26% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర దేశాలపై కూడా ఇలాంటి పన్నులు విధించింది. కొన్ని దేశాలు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నాయని, అందుకే ఈ సుంకాలు విధించామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా నుండి వచ్చే వస్తువులపై అధిక పన్నులు విధించే దేశాలపై ఈ సుంకాల వేటు పడింది. అయితే అత్యధిక జనాభా కలిగిన చైనాపై 34 శాతం సుంకం విధించగా, గతంలో విధించిన 20 శాతానికి అదనం. ఈ విధంగా చైనా 54 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. విషయం ఏంటంటే అమెరికాకు చైనా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

అమెరికా అధ్యక్షుడు రోజ్ గార్డెన్లో జరిగిన "మేక్ అమెరిక వెల్తి అగైన్" కార్యక్రమంలో "భారతదేశం చాలా చాలా కఠినమైనది" అని అన్నారు. భారత ప్రధాన మంత్రి నాకు చాలా మంచి స్నేహితుడు, కానీ మాతో సరిగ్గా వ్యవహరించడం లేదు. వాళ్ళు మా నుండి 52% పన్ను వసూలు చేస్తున్నారు, కానీ మేము అంతగా పన్ను వసూలు చెయ్యట్లేదు. 2024లో భారతదేశం - అమెరికా మధ్య వాణిజ్యం $124 బిలియన్లు కాగా, భారతదేశం USకి $81 బిలియన్ల విలువైన వస్తువులను విక్రయించింది, అదే సమయంలో US నుండి $44 బిలియన్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. ఈ విధంగా భారతదేశం $37 బిలియన్ల మేర ప్రయోజనం పొందింది. నివేదికల ప్రకారం, అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై పన్నులను తగ్గించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఇది కూడా భారీ తగ్గింపు అవుతుంది.
ఈ కొత్త సుంకాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనా వేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ట్రంప్ విధించిన పన్నుల ప్రభావం వివిధ దేశాలపై ఎలా ఉంటుందో కూడా పరిశీలిస్తున్నారు. అమెరికాలో వస్తువులను అమ్మడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ ఇప్పటికే భారతీయ పరిశ్రమలతో చర్చలు జరుపుతుంది.
చైనాపై అత్యధిక పన్ను: పక్క దేశమైన చైనాపై అమెరికా 34% పన్ను విధించగా, చాలా కాలంగా అమెరికాకి చైనా లక్ష్యంగా ఉంది. మరోవైపు EU 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంబోడియాపై అత్యధికంగా 49 శాతం సుంకం విధించింది. వియత్నాం 46% పన్ను చెల్లించాల్సి రావడంతో ఎక్కువగా నష్టపోతుంది. దక్షిణ కొరియా 25%, జపాన్ 24%, తైవాన్ 32% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ 10% పన్ను చెల్లించాల్సి ఉండగా, స్విట్జర్లాండ్ 34% పన్ను, దక్షిణాఫ్రికా 30%, ఇండోనేషియా 32%, బ్రెజిల్ అండ్ సింగపూర్ 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికాకు వచ్చే అన్ని వస్తువులపై 10% బేస్ వడ్డీని విధించనున్నట్లు కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అయితే, దీని గురించి ఇంకా పెద్దగా సమాచారం అందలేదు. వాణిజ్య లోటు భద్రతా ముప్పును కలిగిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. అందుకే జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 10% పన్ను ఏప్రిల్ 5న అర్ధరాత్రి 12:01 (0401 GMT) నుండి అమల్లోకి వస్తుంది. AFP నివేదిక ప్రకారం, వివిధ దేశాలపై ఏప్రిల్ 9 నుండి సుంకాలు విధించబడతాయి. అయితే అమెరికాలో వస్తువులను తయారు చేసే కంపెనీలకు ఈ చర్య ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications