మీరు తరుచూ విమానాల్లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. ద్రవ్యోల్భణ భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ప్రభావం చూపడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో మన వద్ద విమాన ఇంధన ధర పెరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా డొమెస్టిక్ విమాన ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. అయితే మార్చి 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమానాలకు కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో అబ్రోడ్ ధరలు మాత్రం కాస్త తగ్గే అవకాశముంది.

నాలుగు వారాల్లో 30 శాతం జంప్
డొమెస్టిక్ విమాన ధరలు గత రెండు నుండి నాలుగు వారాల్లోనే ఏకంగా 15 శాతం నుండి 30 శాతం మధ్య పెరిగాయి. ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఐఎక్స్ఐగో ప్రకారం ఢిల్లీ-ముంబై వన్-వే విమాన ఛార్జీ ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 మధ్య రూ.5119కి పెరిగింది. అంతకుముందు అంటే ఫిబ్రవరి 1 నుండి 7 మధ్య ఈ ఛార్జీ రూ.4055గా ఉంది. 26 శాతం పెరిగి, రూ.1000కి పైగా పెరిగింది. అలాగే కోల్కతా-ఢిల్లీ మధ్య రూ.4916 నుండి 29 శాతం పెరిగి రూ.6114కు చేరుకుంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరిగి, ఇది విమాన ఇంధన పెరుగుదలకు కారణమై, తద్వారా టిక్కెట్ ధరలు పెరిగాయి.

ధరలు ఎలా పెరిగాయంటే
ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం మార్చి 1, 2021లో కిలో లీటర్కు రూ.55,350 ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి రూ.95,350గా ఉంది. అంటే దాదాపు మూడింట రెండొంతులు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్ ధరలు మార్చి 8న 130 డాలర్లకు చేరుకోవడమే. 2021 మార్చి 10న ఇదే బ్రెంట్ 68 డాలర్ల వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి, తదనుగుణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ లైన్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. ఢిల్లీ, గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత మార్గాల్లో ధరలు పెరిగాయని చెబుతున్నారు.

పునరుద్దరణ
ఇక, మార్చి 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తోంది ప్రభుత్వం. సర్వీసులు పెరుగుతాయి. ఎయిర్ బబుల్లో భాగంగా ఇప్పటి వరకు సర్వీసులు పరిమితమయ్యాయి. భారత్ నుండి ప్రతివారం 2000 వరకు విమానాలు విదేశాలకు వెళ్తున్నాయి. కరోనాకు ముందు ఈ సంఖ్య 4700. అంటే సగాని కంటే ఎక్కువగా తగ్గింది. అంతర్జాతీయ విమానాలపై పరిమితులు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, పెరుగుతున్న చమురు ధరలు వంటి అంశాలు కారణమయ్యాయి.
ఉదాహరణకు ఢిల్లీ నుండి దుబాయ్కు కరోనా కంటే ముందు విమాన ఛార్జీ రూ.24,751. 2022 ఫిబ్రవరిలో ఇది 32 శాతం పెరిగి రూ.32,651గా ఉంది.
ఢిల్లీ-మాడ్రిడ్ మార్గంలో 2020 ఫిబ్రవరిలో విమాన ఛార్జీ రూ.48,418 కాగా, 2022 ఫిబ్రవరి నాటికి ఇది రూ.39 శాతం పెరిగి రూ.67,436గా ఉంది. అయితే విమానాల పునరుద్ధరణ తర్వాత కెపాసిటీ పెరిగి, దీనికి తోడు చమురు ధరలు 130 డాలర్ల నుండి 110 డాలర్లకు రావడంతో అంతర్జాతీయంగా ధరలు ప్రస్తుతం కంటే తగ్గే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications