ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్లో అనేక ఆశాజనకమైన స్టాక్లు కనిపిస్తుంటాయి. ఇటువంటి స్టాక్లు కొన్నిసార్లు మల్టీబ్యాగర్గా మారతాయి. వాటి అంచనాలు బద్దలు కొట్టి పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందిస్తాయి. అటువంటి స్టాకే డీప్ డైమండ్. ఇది దాని పెట్టుబడిదారులకు 1000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. అంతేకాకుండా, స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ వరుసగా ఐదవ సెషన్కు అప్పర్ సర్క్యూట్ను తాకింది.
బుధవారం (జనవరి 25) షేరు ధర రూ.18.45 వద్ద 5 శాతం ఎగువ సర్క్యూట్లో లాక్ అయింది. శుక్రవారం (జనవరి 27), పతనమైన మార్కెట్ మధ్య స్టాక్ మళ్లీ రూ.19.35 వద్ద ముగిసింది. మల్టీబ్యాగర్ స్టాక్ను కంపెనీ ఇటీవల 10:1 నిష్పత్తిలో విభజించింది. ఇంతకు ముందు షేరు ముఖ విలువ రూ.10 ఉండగా.. కంపెనీ విభజన తర్వాత డీప్ డైమండ్ ముఖ విలువ రూ.1గా మారింది.

కంపెనీలో మిగులు సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు తమ బోర్డు నుంచి అనుమతి లభించిందని కంపెనీ ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. ఈ కంపెనీ తమ దగ్గర మిగిలిన డబ్బును ఇతర కంపెనీల షేర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి లేదా సబ్స్క్రయిబ్ చేయడానికి వాడనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), పవన, సౌరశక్తి వంటి గ్రీన్ ఎనర్జీ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కొత్త యుగం వ్యాపారాలపై ఈ కంపెనీ దృష్టి సారించింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన ప్రోత్సాహాన్ని బట్టి EV రంగం అధిక వృద్ధి అవకాశాలను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆబ్జెక్ట్ నిబంధనలో మార్పును డీప్ డైమండ్స్ బోర్డు ఆమోదించింది. డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 233.33 శాతం పెరిగి రూ. 1.5 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం రూ.0.01 కోట్ల నుంచి రూ.0.61 కోట్లకు పెరిగింది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications