కరోనా మహమ్మారి సంక్షోభం నుండి బయటపడేందుకు భారత్కు 200 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని ప్రభుత్వానికి అసోచామ్ సూచించింది. భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ప్యాకేజీయే అవసరమని తెలిపింది. రానున్న మూడు నెలల్లోనే 50 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్ల క్యాష్ ఇన్ఫ్లో అవసరమని తెలిపింది.

పారిశ్రామికవర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ
ఈ మహమ్మారి కారణంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. ఈ సంక్షోభం నుంచి కోలుకోవాలంటే భారీ ఉద్దీపనలు తప్పనిసరని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కరోనా కష్టాల నుంచి పేదలు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం గత నెల రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ఆర్థికంగా లభించిన ఊరట లేదు. తమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి.

22.50 లక్షల కోట్ల ఉద్దీపనలు అవసరం
ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నామని, ప్యాకేజీ కూడా అదేస్థాయిలో ఉండాలని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే 12 నెలల నుండి 18 నెలల్లో కనీసం 20,000 కోట్ల డాలర్ల (రూ.15 లక్షల కోట్లు) నుంచి 30,000 కోట్ల డాలర్ల (రూ.22.50 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీ కల్పించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీ రేటు తగ్గింపు
జీఎస్టీ రేటును కూడా తగ్గించాలని అసోచామ్ కోరింది. మూడు నెలల కాలానికి 50 శాతం, ఈ ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి తగ్గించాలని సూచించింది.

నిర్మలకు సూచనలతో లేఖ
కరోనా మహమ్మారిపై పోరుకు పలు సూచనలు చేస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అసోచామ్ ప్రెసిడెంట్ డాక్టర్ నిరంజన్ హీరానందని లేఖ రాశారు. స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 10 శాతం ఉద్దీపన చర్యలు ఉండాలని కోరారు. ఇందుకు భారత్కు 200 బిలియన్ డాలర్లకు పైగా అవసరమని పేర్కొన్నారు.

ఉద్యోగ నష్టాలు తగ్గించేందుకు..
రాబోయే 12-18 నెలల్లో 300 బిలియన్ డాలర్లు అవసరమన్నారు. రాబోవు మూడు నెలల్లో 50-100 బిలియన్ డాలర్లు వ్యవస్థలోకి పంపింగ్ చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగ నష్టాలను తగ్గించేందుకు, ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు పై చర్యలు తీసుకోవాలని కోరారు.

క్లిష్ట సమయంలో..
భారీ ప్యాకేజీ ప్రకటించి, వ్యవస్థలోకి పంపించడం ద్వారానే వ్యాపారాలు, కార్మికులకు ఇలాంటి పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ప్రత్యక్ష బదలీ ద్వారా ఉద్యోగులు, లేబర్కు సహాయం, సంక్షోభం నుండి బయటపడేందుకు తగినంత నగదు ప్రవాహం ఉందని కంపెనీలకు ధీమా కల్పించడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు.. ఈ ప్యాకేజీ ఉపయోగమన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications