ఢిల్లీ: మార్చి నెల పీఎఫ్ చందాల చెల్లింపుకు గడువు తేదీని మే 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. వాస్తవానికి ఈ గడువు తేదీ ఏప్రిల్ 15వ తేదీ ఉంది. అదనంగా మరో నెల రోజుల సమయాన్ని ఇచ్చింది. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి నిరోధక ఆంక్షల నేపథ్యంలో మార్చి వేతనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ (ECR) సమర్పణకు గడువును 2020 మే 15వ తేదీ వరకు పొడిగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

6 లక్షల కంపెనీలకు ఊరట
కేంద్ర కార్మిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 6 లక్షల కంపెనీలకు ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించలేని సంస్థలకు కొంత ఊరటను ఇచ్చేందుకు, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కంపెనీలు తాము ఏ తేదీన వేతనాలు చెల్లించాయో ECR రూపంలో ప్రకటించవలసి ఉంటుంది. కార్మిక శాఖ నిర్ణయంతో మార్చి నెల ECRను కంపెనీలు 2020 మే 15వ తేదీ లేదా ఆ లోగా సమర్పించవలసి ఉంటుంది.

12,000 కోట్ల లిక్విడిటీ ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ ఊరట వల్ల వివిధ కంపెనీలకు రూ.12,000 కోట్ల లిక్విడిటీ ప్రయోజనం కలగనుంది. అసలే ఉత్పత్తి, బిజినెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు కేంద్రం పీఎఫ్ చందా జమ చేసే తేదీ గడువు పొడిగించడం వల్ల ఎంతోకొంత లిక్విడిటీ ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపార నష్టాలను దృష్టిలో ఉంచుకొని జమ చేసే గడువును 30 రోజులు పొడిగించినట్లు రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ బుధవారం నోటిఫికేషన్లో తెలిపింది.

కేంద్రం భారీ ఊరట
కంపెనీలు మార్చి నెలకు సంబంధించిన 12 శాతం ఉద్యోగి వాటా, 12 శాతం యజమాని వాటా పీఎఫ్ వాటాలు.. మొత్తం 24 శాతం వాటాను ఏప్రిల్ 15వ తేదీ లోపు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓకు ప్రతి నెల పీఎఫ్, పెన్షన్ కాంట్రిబ్యూషన్గా కంపెనీల నుండి రూ.12,000 కోట్ల నుండి రూ.12,500 కోట్లు వస్తాయి.

మరోసారి పొడిగించే అవకాశం
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కంపెనీలకు భారీ ఊరట కల్పించిందని, మరోసారి కూడా పొడిగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అప్పుడు కంపెనీలకు రెండు పర్యాయాలు కలిపి రూ.24,000 కోట్ల లిక్విడిటీ వెసులుబాటును కల్పించినట్లవుతుందని చెబుతున్నారు.

పరిస్థితి మారకపోవచ్చు
లాక్ డౌన్ను ఇప్పటికే పొడిగించినందున పరిస్థితులు వచ్చే నెల నాటికి కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. కాబట్టి అప్పటికీ మళ్లీ పొడిగింపే శరణ్యమంటున్నారు. మానవతాదృక్పథంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం అడుగుతోందని, ఇలాంటి సమయంలో కేంద్రం కూడా తన శక్తి మేరకు ఇలాంటి వెసులుబాటు కల్పిస్తోందని అంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications