ఇండియా డైమండ్ పరిశ్రమపై కరోనా వైరస్ భారీ దెబ్బ

కరోనావైరస్ కారణంగా భారత డైమండ్ ఎగుమతులపై ప్రభావం పడుతోంది. ఈ వైరస్ కారణంగా వజ్రాల ఎగుమతులు తగ్గనున్నాయి. 2020-21 ఏడాది చివరి నాటికి 20 శాతం వరకు తగ్గి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయని అంచనా. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలోను ఎగుమతులు తగ్గడం లేదా అదే స్థాయిలో కొనసాగవచ్చునని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదికలో తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18 శాతం తగ్గాయి. మార్చి 2019 నుండి జనవరి 2020 మధ్య డైమండ్ ఎగుమతులు 16.32 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఏప్రిల్ 2018 నుండి జనవరి 2019 మధ్య 19.61 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 17 శాతం తగ్గిపోయాయి.

 Coronavirus to shrink Indias diamond exports to USD 19 billion

వీటిలో 40 శాతం ఎగుమతులు హాంగ్‌కాంగ్‌కు ఉన్నాయి. జనవరి 15 నుంచి హాంగ్‌కాంగ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జనవరి - మార్చి త్రైమాసికంలో ఎగుమతులు మరింతగా తగ్గవచ్చు. ఈ ఒక్క క్వార్టర్‌లోనే ఎగుమతులు దాదాపు బిలియన్ డాలర్ల మేరకు ప్రభావం చూపవచ్చునని అంచనా. ఇప్పటికే డిమాండ్ తగ్గి, వసూళ్లు పడిపోవడం, హాంగ్‌కాంగ్ రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో డైమండ్ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు కరోనా మరో కొత్త సమస్యగా మారింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+